Begin typing your search above and press return to search.

SSMB29 విలన్.. ఇది రాజమౌళికైనా తెలుసా?

By:  Tupaki Desk   |   7 Jun 2023 7:00 PM GMT
SSMB29 విలన్.. ఇది రాజమౌళికైనా తెలుసా?
X
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రొడక్షన్ దశ లో ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీ ని పూర్తిచేసిన తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా స్టార్ట్ చేయనున్నారు.

ఈ సినిమా కి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీ గా దీనిని తెరకెక్కించబోతున్నారు. ఈ ఏడాది ఆఖరు లో ఎస్ఎస్ఎంబి29 మూవీ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక భారీ తారాగణం తో అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నార ని టాక్. అలాగే హాలీవుడ్ యాక్టర్స్ ని ఈ మూవీ కోసం తీసుకోవడానికి రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఉన్నపళంగా ఈ సినిమా గురించి ఓ ఇంటరెస్టింగ్ రూమర్ తెర పైకి వచ్చింది. బాలీవుడ్ లో ఈ గాసిప్ జోరు గా ప్రచారం అవుతోంది. ఎస్ఎస్ఎంబి 29 సినిమా లో హీరోయిన్ గా దీపికా పదుకునేని తీసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. అలాగే మూవీ లో ప్రతినాయకుడి పాత్ర కోసం అమీర్ ఖాన్ ని ఎంపిక చేసారనే మాట సోషల్ మీడియా లో విస్తృతంగా సర్క్యులేట్ అవుతోంది.

అయితే ఈ సినిమా కి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ కూడా కూడా ఇంకా పూర్తి కాలేదు. స్క్రిప్ట్ కంప్లీట్ కావడానికి మరో మూడు, నాలుగు నెలల సమయం పట్టొచ్చు ఇంత లోనే ఈ మూవీ పై గాసిప్స్ వినిపిస్తూ ఉండటం విశేషం. జక్కన్న సినిమా పై జరుగుతున్న ఈ ప్రచారం గురించి కనీసం రాజమౌళి కి కూడా తెలిసి ఉండకపోవచ్చు అని సెటైర్స్ పడుతున్నాయి.

ఎస్ఎస్ఎంబి 29 చిత్రం లో సూపర్ స్టార్ మహేష్ బాబు వరల్డ్ అడ్వంచర్ ట్రావెలర్ గా కనిపించనున్నాడు. ఇక ఈ పాత్ర కోసం జక్కన్న ప్రత్యేకంగా వర్క్ షాప్ కూడా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ లోపే అమీర్ ఖాన్ ని ఈ సినిమా లో విలన్ గా, దీపికా పదుకునే హీరోయిన్ అంటూ బాలీవుడ్ లో ప్రచారం చేస్తూ ఉండటం గమనార్హం.