Begin typing your search above and press return to search.

SSMB 28: ఆ రెండిట్లో ఎదో ఒకటి?

By:  Tupaki Desk   |   25 May 2022 5:17 AM GMT
SSMB 28: ఆ రెండిట్లో ఎదో ఒకటి?
X
సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో మొత్తానికి పరవాలేదు అనే విధంగా కలెక్షన్స్ అందుకని మరొకసారి తన స్టార్ హోదా ఏమిటో నిరూపించుకున్నాడు. కాస్త నెగిటివ్ టాక్ వచ్చినా మహేష్ ఇమేజ్ తో సినిమా నిలదొక్కుకున్నట్లు తెలుస్తోంది.

అయితే తదుపరి సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే. SSMB 28వ ప్రాజెక్టుగా లాంచ్ అయిన ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ పెట్టబోతున్నారు అనేది కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ అయితే టైటిల్ తోనే జనాలను ఆకట్టుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. అంతే కాకుండా అందులో 'అ' సెంటిమెంట్ కూడా ఉండాలని అనుకుంటారు. ఇక మహేష్ బాబు తో చేయబోయే ప్రాజెక్టులో మంచి యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు ఫ్యామిలీ ఎమోషనల్ సీన్స్ కూడా గట్టిగానే ఉంటాయని తెలుస్తోంది. ఇదివరకే వీరి కలయికలో వచ్చిన అతడు సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఇక ఆ తర్వాత ఖలేజా సినిమా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్గా ఆడక పోయినప్పటికీ అందులోని మహేష్ కామెడీ టైమింగ్ జనాలకు బాగా నచ్చుతుంది. అయితే ఇప్పుడు వీరి కలయికలో రాబోయే మూడో సినిమా తప్పకుండా అంతకుమించి అనేలా ఉంటుంది అని ప్రేక్షకులు ఒక గట్టి నమ్మకం అయితే ఉంది. అయితే ఈ సినిమా కథకు తగ్గట్టుగా టైటిల్ సెట్ చేసే పనిలో త్రివిక్రమ్ బిజీగా ఉన్నాడు. మొన్నటివరకు అయితే ఈ సినిమాకు అర్జునుడు అనే టైటిల్ అనుకుంటున్నట్లు టాక్ వచ్చింది.

అయితే ఇది వరకే మహేష్ అర్జున్ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఆ టైటిల్ అంతగా సెట్ అవ్వదు అని కూడా అంటున్నారు. మరొకవైపు పార్థు అనే టైటిల్ కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం. అతడు సినిమాలో పార్థు అనే పేరుతోనే మహేష్ బాబు నటించాడు. ఆ పేరు చుట్టే సినిమా మొత్తం తిరుగుతుంది కాబట్టి మళ్లీ అదే టైటిల్ పెడతారా లేకపోతే కొత్తగా త్రివిక్రమ్ ఏదైనా ఆలోచిస్తారా అనేది చూడాలి. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ రెండిటిలో ఏదో ఒకటి ఫైనల్ అయ్యేలా ఉందని కూడా అంటున్నారు. మరి త్రివిక్రమ్ ఎలా ఆలోచిస్తారో చూడాలి.