Begin typing your search above and press return to search.

మహేష్ అందుకే ఆ టైటిల్ పక్కన పెట్టాడా?

By:  Tupaki Desk   |   3 Jun 2023 9:42 AM GMT
మహేష్ అందుకే ఆ టైటిల్ పక్కన పెట్టాడా?
X
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కంప్లీట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాకి గుంటూరు కారం అనే టైటిల్ ని రీసెంట్ గా ఖరారు చేశారు. మహేష్ కెరియర్ లో ఫస్ట్ టైమ్ ఇలాంటి మాస్ అప్పీల్ ఉన్న క్యారెక్టర్ ని చేయబోతున్నాడు. ఈ నేపథ్యంలో మూవీపై అందరిలో ఆసక్తి నెలకొంది.

ఇదిలా ఉంటే తాజాగా రిలీజ్ అయిన మాస్ స్ట్రైక్ కూడా సినిమాపై కొంత వరకు హైప్ క్రియేట్ చేసింది. మహేష్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతోంది అనేది కొంత క్లారిటీ వచ్చింది. ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ త్వరలో స్టార్ట్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. పూజా హెగ్డే, శ్రీలీల ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఇదిలా ఉంటే సినిమాకి ముందుగా అమరావతికి అటు ఇటు అనే టైటిల్ పెట్టాలని త్రివిక్రమ్ డిసైడ్ అయ్యారంట. అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో అమరావతి అనేది అత్యంత వివాదాస్పదమైన పేరు.

ఈ పేరు చుట్టూనే రాజకీయం మొత్తం నడుస్తోంది. ఇలాంటి సమయంలో అమరావతికి అటు ఇటు అనే టైటిల్ పెడితే కచ్చితంగా ఒక వర్గం నుంచి వ్యతిరేకత వచ్చే ఛాన్స్ ఉంది.

ఈ విషయాన్ని గ్రహించి మహేష్ బాబు కాంట్రవర్సీ వద్దని త్రివిక్రమ్ కి చెప్పారంట. అదే సమయంలో గుంటూరు కారం టైటిల్ ని కూడా సూపర్ స్టార్ సజిస్ట్ చేసినట్లుగా ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. అమరావతికి అటు ఇటు పేరుతో పాటు మరికొన్ని పరిశీలనలో ఉంచుకున్నారని, వాటిలో గుంటూరు కారం మహేష్ బాబుకి భాగా నచ్చిందని తెలుస్తోంది.

దీంతో అదే పేరుని ఫైనల్ గా ఖరారు చేసి. దాంతోనే మాస్ స్ట్రైక్ ని రిలీజ్ చేసి ఫ్యాన్స్ కి ఉత్సాహం తీసుకొచ్చారు. మరి గుంటూరు కారం ప్రేక్షకుల ఏ విధంగా ఎంటర్టైన్ చేసి మహేష్ కెరియర్ లో మాస్ హిట్ గా నిలిస్తుంది అనేది వేచి చూడాలి.