Begin typing your search above and press return to search.

మాస్ మహారాజ్ 'ఖిలాడీ' కోసం అక్కడ తగ్గాడా...?

By:  Tupaki Desk   |   19 Oct 2020 11:10 AM GMT
మాస్ మహారాజ్ ఖిలాడీ కోసం అక్కడ తగ్గాడా...?
X
మాస్ మహారాజ్ రవితేజ గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. 2017లో వచ్చిన 'రాజా ది గ్రేట్' సినిమా తర్వాత రవితేజ ఒక్క హిట్ కూడా అందుకోలేదు. వరుసగా 'టచ్ చేసి చూడు' 'నేల టికెట్' 'అమర్ అక్బర్ ఆంటోనీ' 'డిస్కో రాజా' సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూశాయి. ఈ క్రమంలో ఎలాగైనా మళ్ళీ పుంజుకోవాలన్న కసితో 'క్రాక్' అనే మూవీ చేస్తున్నాడు. రవితేజ కెరీర్లో 66వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో పాటు 'రాక్షసుడు' ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడీ' అనే మూవీని స్టార్ట్ చేశాడు. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ ను హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్‌ బ్యానర్ పై ప్ర‌ముఖ నిర్మాత కోనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మించనున్నారు. అయితే ఈ సినిమాకి రవితేజ తన రెమ్యూనరేషన్ తగ్గించాడని టాక్ వినిపిస్తోంది.

ఒకప్పుడు వరుస హిట్లతో మినిమమ్ గ్యారంటీ సినిమాతో నిర్మాతల హీరో అనిపించుకున్న రవితేజ పరిస్థితి మారిపోయింది. వరుస ప్లాప్ లతో మార్కెట్ కూడా ముందులా లేదని తెలుస్తోంది. అందుకే ఇంతకముందు సినిమాకి సుమారు 12 కోట్ల వరకు తీసుకునే రవితేజ.. ప్రస్తుతం నటిస్తున్న 'ఖిలాడీ' మూవీకి కేవలం 8 కోట్లు మాత్రమే తీసుకుంటున్నాడట. 'రాజా ది గ్రేట్' సమయంలోనే ఈ ప్రాజెక్ట్ కోసం అడ్వాన్స్ తీసుకున్న రవితేజకు ప్రొడ్యూసర్స్ నుంచి ఇంకేం డ‌బ్బులు ముట్టేలా లేవట. ఇక సినిమా విషయానికొస్తే 'ఖిలాడీ'లో రవితేజ సరసన యంగ్ బ్యూటీస్ మీనాక్షి చౌదరి మరియు డింపుల్ హ‌య‌తి నటించనున్నారు. త్వరలోనే 'RT67' మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. ఏదేమైనా ప్రస్తుతం రవితేజ నటిస్తున్న 'క్రాక్' మరియు 'ఖిలాడీ' సినిమాలు సక్సెస్ అయితేనే రవితేజ మళ్ళీ ట్రాక్ లోకి వచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు.