Begin typing your search above and press return to search.

రంగ రంగా రేర్ కాంబినేష‌న్ రిపీట్

By:  Tupaki Desk   |   13 Nov 2019 12:01 PM GMT
రంగ రంగా రేర్ కాంబినేష‌న్ రిపీట్
X
కాంబినేష‌న్స్ ఆల్వేస్ హాట్ టాపిక్. కొన్ని కాంబినేష‌న్స్ నుంచి అద్భుతాలు పుడ‌తాయి. స్వ‌ర‌మాంత్రికుడు ఇళ‌య‌రాజాతో బ్లాక్ బ‌స్ట‌ర్ కాంబినేష‌న్స్ గురించి అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ముచ్చ‌టించుకుంటారు. తాజా స‌మాచారం ప్ర‌కారం.. క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ వంశీ- మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా కాంబినేష‌న్ రిపీట్ కానుంద‌ని తెలుస్తోంది.

ఇంతకుముందు అంతఃపురం (1998) చిత్రానికి క‌లిసి ప‌నిచేసిన ఈ జోడీ మ‌రోసారి తాజా క్రేజీ ప్రాజెక్ట్ కోసం క‌లుస్తున్నారు. ప్ర‌స్తుతం కృష్ణ‌వంశీ 'రాజ మార్తాండ' అనే చిత్రం తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌రాఠా సూప‌ర్ హిట్ న‌ట‌సామ్రాట్ కి రీమేక్ ఇది. ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన ఒక థియేట‌ర్ ఆర్టిస్టు త‌న గ‌తాన్ని మ‌ర్చిపోవ‌డానికి ఏం చేశాడ‌న్న‌దే ఈ సినిమా. మ‌ర‌పురాని క‌ష్టాల్ని మ‌ర్చిపోయేందుకు క‌ళాకారుడు ఎలాంటి వేద‌న‌కు గుర‌య్యాడు అన్న‌ది చూపిస్తూ ఆద్యంతం ఎమోష‌న‌ల్ గా సాగే చిత్ర‌మిద‌ని తెలుస్తోంది. ఇందులో మ‌రాఠా ఫేమ‌స్ న‌టి మేధా మంజ్రేక‌ర్ చేసిన పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ‌ న‌టిస్తారు. అలాగే ది గ్రేట్ పెర్ఫామ‌ర్ నానా ప‌టేక‌ర్ పోషించిన పాత్ర‌లో విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ న‌టిస్తున్నారు. అభిషేక్ జాక‌ర్- మ‌ధు క‌లిపు సంయుక్తంగా ఈ రీమేక్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

గ‌తంలో రాజా సంగీతం అందించిన‌ 'అంతఃపురం' మ్యూజికల్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఆ సినిమా పాటు.. రీరికార్డింగ్ ప్ర‌తిదీ హైలైట్. అందుకే ఇంత గ్యాప్ వ‌చ్చినా కృష్ణ‌వంశీ తాజా చిత్రం కోసం మ్యాస్ట్రోని ఏరికోరి బ‌రిలో దించుతున్నారు. దాదాపు రెండు ద‌శాబ్ధాల త‌ర్వాత ఈ క‌ల‌యిక సాధ్య‌మ‌వుతోంది. ఈ జోడీ మ‌రోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేస్తారా? అన్న‌ది చూడాలి. ఇక‌పోతే కృష్ణ‌వంశీ- ప్ర‌కాష్ రాజ్ కాంబినేష‌న్ లో ఎన్నో చిత్రాలొచ్చాయి. అంతఃపురం చిత్రానికి ఆ ఇద్ద‌రూ క‌లిసి ప‌ని చేశారు. ఇప్పుడు మ‌రోసారి అరుదైన కాంబినేష‌న్ రిపీట‌వుతుండ‌డంతో అభిమానుల్లో ఆస‌క్తి నెల‌కొంది.