Begin typing your search above and press return to search.

'అయ్యప్పనుమ్ కోసియుమ్' రీమేక్ వెంకీ కుడుముల చేతిలో పడిందా..?

By:  Tupaki Desk   |   27 March 2020 10:10 AM GMT
అయ్యప్పనుమ్ కోసియుమ్ రీమేక్ వెంకీ కుడుముల చేతిలో పడిందా..?
X
అయ్యప్పనుమ్ కోసియుమ్'...ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఇది మలయాళంలో రీసెంటుగా విడుదలై ఘన విజయం సాధించిన ఒక సినిమా. ఈ మలయాళ సినిమాలో పృథ్వీరాజ్ బిజూ మీనన్ లు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా రీమేక్ చేయాలని ఇతర ఇండస్ట్రీల వాళ్లు పోటీ పడుతున్నారు. మన టాలీవుడ్ విషయానికొస్తే ఈ మూవీ రీమేక్ రైట్స్ హారిక హాసిని - సితార ఎంటర్టైన్మెంట్స్ వారి దగ్గర ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించి రోజూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఇప్పటి దాకా ఈ సినిమాలో హీరోలు ఎవరనే దాని మీద పుకార్లు రాగా ఇప్పుడు దర్శకుల మీద వస్తున్నాయి. తాజాగా దీని గురించి మరో న్యూస్ బయటకు వచ్చింది.

హారిక హాసిని వాళ్ళకి త్రివిక్రమ్ కి ఉన్న రిలేషన్షిప్ గురించి తెలిసిందే. రాధాకృష్ణ (చినబాబు) నాగవంశీ లతో త్రివిక్రమ్ కి మంచి అనుబంధం ఉంది. త్రివిక్రమ్ ఈ మధ్య అన్నీ సినిమాలు వాళ్ళ బ్యానర్ లోనే చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సినిమా రీమేక్ పనులు ఇప్పుడు త్రివిక్రమ్ చూసుకుంటున్నాడట. ఈ సినిమా బాధ్యతను తన భుజాల మీద వేసుకున్న త్రివిక్రమ్ ఈ స్క్రిప్ట్ పనులను డైరెక్టర్ వెంకీ కుడుములకు అప్పగించాడంట. వాస్తవానికి త్రివిక్రమ్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో మూవీ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ మధ్యే భీష్మ సినిమాతో మంచి హిట్ కొట్టిన వెంకీ కుడుములు అయితే ఈ స్క్రిప్ట్ పనులు పక్కాగా చూసుకుంటాడని త్రివిక్రమ్ భావించాడట. అంతేకాకుండా ఈ మలయాళ సీరియస్ స్క్రిప్టులో హ్యూమర్ కూడా యాడ్ చేసి స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ సినిమాలో ఎవరు నటిస్తున్నారనేది పక్కన పెడితే ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. అంతలా చర్చ జరుగుతున్న ఈ సినిమా మన తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో చూడాలి.