Begin typing your search above and press return to search.

ఆ పాత్రకోసం హీరో వాటా కావాలన్నాడా..?

By:  Tupaki Desk   |   8 April 2020 2:30 PM GMT
ఆ పాత్రకోసం హీరో వాటా కావాలన్నాడా..?
X
గతేడాది మలయాళంలో విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా "అయ్యప్పనుమ్ కోషియం". ఈ సినిమాలో బిజూ మీనన్,- పృథ్వీరాజ్ సుకుమారన్ లు ప్రధాన పాత్రలు పోషించారు. ఒక హవాల్దారుకి - ఒక పోలీస్ ఆఫీసర్ ల మధ్య రగిలిన బలమైన ఇగోల చుట్టూ ఈ సినిమా కథాంశం సాగుతుంది. బలమైన పాత్ర చిత్రణతో తెరకెక్కించారు డైరెక్టర్. అయితే గత కొంతకాలంగా ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం సౌత్ ఇండియన్ నిర్మాతలు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను మాత్రం నిర్మాత సూర్యదేవర నాగవంశీ దక్కించుకున్నాడు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం తెలుగులో రూపొందించడానికి నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు నిర్మాత. మొదటగా బిజూ మీనన్ పాత్రకోసం నటసింహం బాలకృష్ణను ఎంపిక చేసినట్లు వార్తలొచ్చినా అది నిజం కాదన్నట్లు మిగిలిపోయింది. ఇంకా పృథ్వీరాజ్ పాత్రకోసం రానాతో సంప్రదింపులు జరుపుతున్నారట. ఈ పాత్రకోసం రానా కూడా సుముఖత చూపినట్లు వినికిడి. అయితే ఈ సినిమాలో తను నటించాలంటే ఒక కండిషన్ పెట్టాడట రానా. అదేంటంటే ఈ సినిమా నిర్మాణంలో తన తండ్రి సురేష్ బాబును భాగస్వామ్యం చేయమన్నాడట. డిస్ట్రిబ్యూషన్ లో కూడా హెల్ప్ అవుతుందని నిర్మాత ఒప్పుకున్నట్లు సమాచారం. దీనిపై ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటనలు రానప్పటికీ విషయాలు త్వరలో వెల్లడిస్తామని నిర్మాత తెలిపారట.