Begin typing your search above and press return to search.
2021 సంక్రాంతికి RED డబుల్ ట్రీట్ కి రెడీ
By: Tupaki Desk | 25 Oct 2020 7:00 AM GMTదసరా రోజు ధమాకా మోగుతోంది. వరుసగా టాలీవుడ్ క్రేజీ సినిమాల పోస్టర్లు దుమారం రేపుతున్నాయి. తాజాగా ఇస్మార్ట్ రామ్ రెడ్ పోస్టర్ రిలీజైంది. సంక్రాంతి 2021 కి థియేటర్లలో దిగిపోతున్నామని ప్రకటించేసింది రామ్ - కిషోర్ తిరుమల బృందం. పక్కా కాన్ఫిడెన్స్ తో విజయదశమి శుభాకాంక్షలతో తాజాగా రామ్ పోస్టర్ ని రివీల్ చేసింది చిత్రయూనిట్.
ఇక ఈ పోస్టర్లో రామ్ డ్యూయల్ లుక్ ఇంప్రెస్సివ్ అనే చెప్పాలి. గుబురు గడ్డం కఠిన మనస్తత్వం ఉన్న కుర్రాడికి సాఫ్ట్ గా టక్కు టై కట్టుకున్న కుర్రాడికి మధ్య రివెంజ్ డ్రామా ఏమిటి? అన్నది ఆద్యంతం రక్తి కట్టించనుందని అర్థమవుతోంది. ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజర్ సైతం రక్లి కట్టించింది. ఆ ట్విస్టేంటో సంక్రాంతికి బిగ్ స్క్రీన్ పైనే రివీల్ చేస్తారట. విజయదశమికి రిలీజ్ తేదీ చెప్పడంతో ఇస్మార్ట్ ఫ్యాన్స్ లో ఉత్కంఠ మొదలైనట్టే.
రామ్ చిత్రం RED డిజిటల్ రిలీజ్ గురించి ఇటీవల ఆసక్తికర చర్చ సాగింది. ఈ డీల్ ఇతర ఒప్పందాలతో పోలిస్తే విభిన్నమని... నిర్మాతలకు డిజిటల్ కంపెనీకి మధ్య ఒక ఆసక్తికర ఒప్పందం కుదిరిందని ముచ్చటించుకున్నారు. ఇప్పటికి హిందీ డబ్బింగ్ హక్కులు.. తెలుగు శాటిలైట్ హక్కులను విక్రయించారు. ఆ మేరకు నిర్మాత ఇప్పటికే పెద్ద మొత్తాలను జేబులో వేసుకున్నారన్న ముచ్చటా సాగింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమా కాబట్టి థియేట్రికల్ రిలీజ్ తో వచ్చే కిక్కును దృష్టిలో ఉంచుకుని ఓటీటీ-డిజిటల్ రిలీజ్ ఒప్పందం కంటే థియేట్రికల్ కే ఆసక్తిగా ఉన్నారని ప్రచారమైంది.
స్రవంతి మూవీస్ బ్యానర్ అంటే రామ్ కి సొంత బ్యానర్ కాబట్టి స్రవంతి రవికిషోర్ నుంచే దీనిపై అధికారిక విషయాలు ప్రకటించాల్సి ఉంటుంది. RED కి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రామ్ ద్విపాత్రాభినయం హైలైట్ గా ఉండనుంది. ఈ క్రేజీ యాక్షన్ ఎంటర్ టైనర్లో నివేదా పెతురాజ్ -మాళవికా శర్మ కథానాయికలుగా నటిస్తున్నారు.
ఇక ఈ పోస్టర్లో రామ్ డ్యూయల్ లుక్ ఇంప్రెస్సివ్ అనే చెప్పాలి. గుబురు గడ్డం కఠిన మనస్తత్వం ఉన్న కుర్రాడికి సాఫ్ట్ గా టక్కు టై కట్టుకున్న కుర్రాడికి మధ్య రివెంజ్ డ్రామా ఏమిటి? అన్నది ఆద్యంతం రక్తి కట్టించనుందని అర్థమవుతోంది. ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజర్ సైతం రక్లి కట్టించింది. ఆ ట్విస్టేంటో సంక్రాంతికి బిగ్ స్క్రీన్ పైనే రివీల్ చేస్తారట. విజయదశమికి రిలీజ్ తేదీ చెప్పడంతో ఇస్మార్ట్ ఫ్యాన్స్ లో ఉత్కంఠ మొదలైనట్టే.
రామ్ చిత్రం RED డిజిటల్ రిలీజ్ గురించి ఇటీవల ఆసక్తికర చర్చ సాగింది. ఈ డీల్ ఇతర ఒప్పందాలతో పోలిస్తే విభిన్నమని... నిర్మాతలకు డిజిటల్ కంపెనీకి మధ్య ఒక ఆసక్తికర ఒప్పందం కుదిరిందని ముచ్చటించుకున్నారు. ఇప్పటికి హిందీ డబ్బింగ్ హక్కులు.. తెలుగు శాటిలైట్ హక్కులను విక్రయించారు. ఆ మేరకు నిర్మాత ఇప్పటికే పెద్ద మొత్తాలను జేబులో వేసుకున్నారన్న ముచ్చటా సాగింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమా కాబట్టి థియేట్రికల్ రిలీజ్ తో వచ్చే కిక్కును దృష్టిలో ఉంచుకుని ఓటీటీ-డిజిటల్ రిలీజ్ ఒప్పందం కంటే థియేట్రికల్ కే ఆసక్తిగా ఉన్నారని ప్రచారమైంది.
స్రవంతి మూవీస్ బ్యానర్ అంటే రామ్ కి సొంత బ్యానర్ కాబట్టి స్రవంతి రవికిషోర్ నుంచే దీనిపై అధికారిక విషయాలు ప్రకటించాల్సి ఉంటుంది. RED కి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రామ్ ద్విపాత్రాభినయం హైలైట్ గా ఉండనుంది. ఈ క్రేజీ యాక్షన్ ఎంటర్ టైనర్లో నివేదా పెతురాజ్ -మాళవికా శర్మ కథానాయికలుగా నటిస్తున్నారు.