Begin typing your search above and press return to search.

NCB విచారణకు రకుల్.. కెమెరా ఫ్లాష్ ల దెబ్బకు బ్లాక్ గ్లాసెస్ ధరించింది...!

By:  Tupaki Desk   |   25 Sep 2020 8:50 AM GMT
NCB విచారణకు రకుల్.. కెమెరా ఫ్లాష్ ల దెబ్బకు బ్లాక్ గ్లాసెస్ ధరించింది...!
X
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ ఇష్యూలో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న ముంబై కి చేరుకున్న రకుల్.. ఎన్‌సిబి అధికారుల విచారణకు బయలుదేరింది. సౌత్ ముంబైలోని కొలాబా ఎన్‌సీబీ గెస్ట్ హౌస్‌ లో ఆమెను విచారిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో రకుల్ ఎన్‌సిబి విచారణకు వెళ్తున్న ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. మీడియా ప్రతినిధులు ఆమెను కెమెరాలలో బంధించే క్రమంలో ఫ్లాష్ ల దెబ్బకు రకుల్ బ్లాక్ గ్లాసెస్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

కాగా, రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు అగ్ర కథానాయికలు దీపికా పదుకొనే - సారా అలీఖాన్ - శ్రద్ధా కపూర్ లకు కూడా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు సమన్లు జారీ చేశారు. నేడు (శుక్రవారం) రకుల్ తో పాటు దీపికా పదుకొనే ని కూడా ఎన్సీబీ విచారించనుంది. ఇప్పటికే దీపికా తన భర్త రణవీర్ సింగ్ తో కలిసి గోవా నుంచి ముంబై చేరుకున్నారు. ఇక శ్రద్ధా కపూర్ - సారా అలీఖాన్ లు శనివారం ఎన్సీబీ దర్యాప్తునకు హాజరు కానున్నారు.