Begin typing your search above and press return to search.

'మసాలాసాంగ్'తో మరో షెడ్యూల్ పూర్తిచేసిన సుకుమార్ బృందం..!

By:  Tupaki Desk   |   6 March 2021 1:30 PM GMT
మసాలాసాంగ్తో మరో షెడ్యూల్ పూర్తిచేసిన సుకుమార్ బృందం..!
X
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రెండు సంవత్సరాల భారీ గ్యాప్ తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా పుష్ప. ఫస్ట్ టైం అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా సినిమా ఇది. ఈ సినిమాతో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నాడు. అయితే ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇప్పటికే విడుదలతేదీ ప్రకటించిన లెక్కలమాస్టర్ భారీ సీక్వెన్స్ షూట్ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవలే గోదావరి జిల్లాల్లోని మారేడుమిల్లి అడవులలో భారీ షెడ్యూల్ పూర్తి చేశారు మేకర్స్. అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీడ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడు.

సుకుమార్ బన్నీ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న మూడో సినిమా ఇది. తాజా సమాచారం ప్రకారం.. పుష్ప బృందం తమిళనాడు షెడ్యూల్ కూడా పూర్తి చేసిందట. ఇదే షెడ్యూల్ లో బన్నీతో మసాలా సాంగ్ కూడా కంప్లీట్ చేసినట్లు టాక్. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సాంగ్స్, మ్యూజిక్ పై అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. బన్నీ-సుక్కు-దేవి కాంబోలో పుష్ప హ్యాట్రిక్ మూవీగా రాబోతుంది. ఇదిలా ఉండగా.. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగష్టు 13న భారతీయ ఐదు భాషల్లో పుష్ప విడుదల కాబోతుంది. చూడాలి మరి బన్నీ పాన్ ఇండియా లాంచ్ సక్సెస్ అవుతుందేమో!