Begin typing your search above and press return to search.

మెగా ప్రాజెక్ట్ ని కంఫర్మ్ చేసిన పూరీ...!

By:  Tupaki Desk   |   29 Sep 2020 4:00 PM GMT
మెగా ప్రాజెక్ట్ ని కంఫర్మ్ చేసిన పూరీ...!
X
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత మళయాళ సూపర్ హిట్ 'లూసిఫర్' తెలుగు రీమేక్ లో నటించాడని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు చిరు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు వీవీ వినాయక్ దర్శకత్వం వహించనున్నారు. దీంతో పాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో 'వేదలమ్' తెలుగు రీమేక్ లో నటించనున్నాడు. అయితే ఏ ప్రాజెక్ట్ ముందుగా స్టార్ట్ చేస్తాడనేది తెలియనప్పటికీ ఈ సినిమాలు చేస్తాడనే విషయంపై మాత్రం క్లారిటీ అయితే వచ్చింది. అదే క్రమంలో బాబీ (కేఎస్ రవీంద్ర) డైరెక్షన్ లో మెగాస్టార్ ఓ సినిమా చేయనున్నాడని వార్తలు వచ్చాయి. కానీ దీనికి సంబంధించి ఎలాంటి న్యూస్ రాకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఉందో లేదో అనే విషయం తెలియకుండా పోయింది. ఈ నేపథ్యంలో స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చిరంజీవి - బాబీ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని కంఫర్మ్ చేశాడు.

నిన్న పూరీ జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో టాలీవుడ్ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. ట్విట్టర్ లో అందరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ వచ్చిన పూరీ.. మెగా ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చాడు. డైరెక్టర్ బాబీ విషెస్ చెప్తూ చేసిన ట్వీట్ ని రీట్వీట్ చేసిన పూరీ.. బాబీకి కృతజ్ఞతలు తెలుపుతూ 'బాస్ తో కిక్కాస్ ఫిల్మ్ చేయమ'ని ట్వీట్ చేసాడు. దీంతో చిరు - బాబీ కాంబోపై స్పష్టత వచ్చేసింది. పూరీ జగన్నాథ్ - చిరంజీవి కాంబినేషన్ లో మూవీ ఆశించిన మెగా ఫ్యాన్స్ ని ఈ విధంగా ఖుషీ చేసాడు డాషింగ్ డైరెక్టర్. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ ఇలా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తుండటంతో అభిమానులు హ్యాపీగా ఉన్నారు. ఇక బాబీ ప్రస్తుతం స్క్రిప్ట్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడని తెలుస్తోంది. గతేడాది చివర్లో మామా అల్లుళ్ళు విక్టరీ వెంకటేష్ - అక్కినేని నాగచైతన్య లను 'వెంకీమామ'తో ఒకే స్క్రీన్ మీద చూపించి అబ్బురపరిచిన బాబీ.. చిరంజీవితో ఏ స్థాయి సినిమాని రూపొందిస్తాడో చూడాలి.