Begin typing your search above and press return to search.

కథ మొత్తం చదివే నిర్మాతలు వాళ్లిద్దరే : త్రివిక్రమ్

By:  Tupaki Desk   |   14 Jan 2021 7:37 AM GMT
కథ మొత్తం చదివే నిర్మాతలు వాళ్లిద్దరే : త్రివిక్రమ్
X
‘తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ మొత్తం చదివేది ఇద్దరు నిర్మాతలు మాత్రమే. వారిలో ఒకరు రామానాయుడుగారు, మరొకరు రవికిశోర్‌గారు. నా కెరీర్‌ మొదట్లోనే నాలుగు సినిమాలు రవికిశోర్‌గారితో పనిచేసే అదృష్టం నాకు దక్కింది’ అన్నారు దర్శకుడు త్రివిక్రమ్. అంతేకాదు.. తన అభిమానాన్ని చాటుకుంటూ రవికిశోర్‌కి పాదాభివందనం చేశారు.

స్రవంతి మూవీస్‌ పతాకంపై కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో రామ్‌ హీరోగా రవికిశోర్‌ నిర్మించిన చిత్రం ‘రెడ్‌’. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ... రామ్‌ను ‘దేవదాస్‌’ సినిమాలో చూసినప్పుడు రవికిశోర్‌గారితో మెరుపుతీగలా ఉన్నాడని చెప్పానన్నారు. ఇక, ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ గురించి మాట్లాడుతూ.. ‘చూసినంత సులువు కాదు అలాంటి సినిమాలో నటించటం’ అన్నారు త్రివిక్రమ్.

హీరో రామ్‌ మాట్లాడుతూ.. ‘మా పెదనాన్నగారితో చాలా సినిమాలు చేశాను. కానీ స్టేజ్‌ మీద ఎప్పుడూ ఆయన గురించి మాట్లాడలేదు. నా దృష్టిలో ‘రెడ్‌’ సినిమాకి రియల్‌ హీరో పెదనాన్న రవికిశోర్‌గారు. ఈ సినిమాని చంటిబిడ్డలా కాపాడుతూ వచ్చారు’ అని అన్నాడు రామ్.

దర్శకుడు కిశోర్ మట్లాడుతూ.. ‘ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన రవికిశోర్‌గారికి, మంచి విజువల్స్‌ ఇచ్చిన సమీర్‌రెడ్డి గారికి థ్యాంక్స్‌’ అన్నారు. ఈ ప్రీ రిలీజ్ వేడుకలో మాళవికా శర్మ, అమృతా అయ్యర్, నివేదా పేతురాజ్, ఆర్ట్‌ డైరెక్టర్‌ ఏయస్‌ ప్రకాశ్, ఎడిటర్‌ జునైద్‌ తదితరులు పాల్గొన్నారు.