Begin typing your search above and press return to search.

చ‌ర‌ణ్ కి ప్ర‌తిష్ఠాత్మ‌క పుర‌స్కారం.. చిరు కంగ్రాట్స్..

By:  Tupaki Desk   |   3 Dec 2022 4:30 AM GMT
చ‌ర‌ణ్ కి ప్ర‌తిష్ఠాత్మ‌క పుర‌స్కారం.. చిరు కంగ్రాట్స్..
X
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ త‌ర్వాత ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌న్న‌న‌లు అందుకుంటున్నాడు. అత‌డి ఫ్యాన్ బేస్ ఇటీవ‌ల దేశ‌విదేశాల్లో అమాంతం పెరిగింది. జాతీయ స్థాయిలో అవార్డులు రివార్డులు అందుకుంటున్నాడు. విదేశీ వేదిక‌ల‌కు అత‌డు ఎటెండ‌వుతుండ‌డంతో మీడియా అటెన్ష‌న్ ఇప్పుడు చెర్రీ పైనే ఉంది.

ఇక జాతీయ మీడియాలో చెర్రీ హవా మామూలుగా లేద‌న‌డానికి చాలా ఉదాహ‌ర‌ణ‌లున్నాయి. క‌ర‌ణ్ జోహార్ పాపుల‌ర్ షో కాపీ విత్ క‌ర‌ణ్.. క‌పిల్ శ‌ర్మ షోల‌తో అత‌డు ఉత్త‌రాది బుల్లితెర‌ అభిమానుల‌కు మ‌రింత చేరువ‌గా వెళ్లాడు. తాజాగా జాతీయ మీడియా నుంచి మ‌రో అరుదైన గౌర‌వం అందుకున్నాడు మ‌గ‌ధీరుడు. పాపుల‌ర్ జాతీయ మీడియా NDTV ప్ర‌తిష్ఠాత్మ‌క పుర‌స్కారం అత‌డికి ద‌క్కింది. 'ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా' అవార్డు లభించింది. ఈ గౌర‌వాన్ని అందుకోవడానికి చ‌ర‌ణ్ ఇప్ప‌టికే ఢిల్లీకి వెళ్ళాడు. చరణ్ సాధించిన తాజా ఘనత అస‌మాన‌మైన‌ది. దీంతో మెగా ఫ్యాన్స్ లో సంబ‌రాలు అంబ‌రాన్ని తాకుతున్నాయి. సోష‌ల్ మీడియాల్లో అభిమానులు స‌హా అన్ని సెక్ష‌న్ల నుంచి విషెస్ పోటెత్తుతున్నాయి.

తాజా గుర్తింపుతో చెర్రీ రేంజు జాతీయ మీడియాలో ఏమేర‌కు పెరిగిందో అర్థం చేసుకోవాలి. అయితే త‌న‌యుడి విజ‌యానికి మెగాస్టార్ చిరంజీవి ఎలా స్పందించారు? అన్న‌ది ఆరా తీస్తే ఆయ‌న ఆనందానికి అవ‌ధుల్లేవ‌ని తెలిసింది.

తన కుమారుడి విజయానికి మెగాస్టార్ ఎంతో సంతోషిస్తున్నారు. చాలా థ్రిల్ కి గుర‌య్యాన‌ని గర్వంగా ఉంద‌ని సామాజిక మాధ్య‌మాల్లో రాసారు. చరణ్ ఇంకా చాలా ముందుకు వెళ్లాలని చిరు బ్లెస్ చేసారు. అభిమానుల కోసం ఈ సంద‌ర్భంలో త్రోబాక్ ఫ్యామిలీ చిత్రాన్ని కూడా మెగాస్టార్ షేర్ చేసారు. ఇందులో చ‌ర‌ణ్ ఎంతో క్యూట్ గా క‌నిపిస్తున్నాడు.

ఆస‌క్తిక‌రంగా బాలీవుడ్ లో ఖాన్ ల త్ర‌యం స‌హా అక్ష‌య్ వంటి వారు షష్ఠిపూర్తి వ‌య‌సులో ఉన్నారు. ఇలాంటి స‌మ‌యంలో టాలీవుడ్ నుంచి యంగ్ హీరోలు బాలీవుడ్ లోను దూసుకెళుతుండ‌డంతో జాతీయ మీడియా నుంచి ప్ర‌చారం గౌర‌వం ద‌క్కుతోంది. ప్ర‌భాస్ - చ‌ర‌ణ్‌- ఎన్టీఆర్-బ‌న్ని- మ‌హేష్ లాంటి స్టార్ల‌కు అరుదైన గౌర‌వం ద‌క్కుతోంది. పాన్ ఇండియాలో స‌ద‌రు స్టార్ల‌కు అవ‌కాశాల వెల్లువ కూడా ఇప్పుడు జోరందుకుంది.

ఇక చ‌ర‌ణ్ త‌దుప‌రి వ‌రుస‌గా పాన్ ఇండియా సినిమాల లైన‌ప్ తో ప‌క‌డ్భందీ వ్యూహాన్ని సిద్ధం చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం దేశం గ‌ర్వించ‌ద‌గిన స్టార్ డైరెక్ట‌ర్ ఎస్.శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఆర్.సి 15లో నటిస్తున్నాడు. ఇటీవల న్యూజిలాండ్ లో ఆర్‌.సి 15 షెడ్యూల్ ను పూర్తి చేసారు. దక్షిణాది సంచలన ద‌ర్శ‌కుడు శంకర్ ఈ సినిమాని పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ కాన్సెప్టుతో తెర‌కెక్కిస్తున్నారు. దీనికోసం నిర్మాత దిల్ రాజు భారీ బ‌డ్జెట్ ని అందిస్తున్నారు. ఇందులో చ‌ర‌ణ్ ఐఏఎస్ ట‌ర్న్ డ్ సీఎంగా క‌నిపిస్తార‌ని టాక్ వినిపిస్తోంది. కియారా అద్వానీ క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా సునీల్ ఒక కీల‌క పాత్ర‌ను పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఇటీవ‌లే రామ్ చ‌ర‌ణ్ విదేశీ షెడ్యూల్ ని పూర్తి చేసి ఇండియాకి వచ్చాడు. ఇంత‌లోనే ఢిల్లీలో పుర‌స్కారం అందుకున్నాడు. ఇక శంక‌ర్ త‌ర్వాత చ‌ర‌ణ్ త‌దుప‌రి కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ తోను ఓ భారీ సినిమాకి స‌న్నాహాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప‌లువురు ద‌ర్శ‌కుల‌కు అత‌డు మాటిచ్చాడు. అన్ని క‌మిట్ మెంట్లు నెర‌వేర్చాల్సి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.