Begin typing your search above and press return to search.

యూవీని సేవ్ చేసిన ప్రభాస్

By:  Tupaki Desk   |   31 May 2023 9:28 AM GMT
యూవీని సేవ్ చేసిన ప్రభాస్
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హోమ్ బ్యానర్ గానే యూవీ క్రియేషన్స్ ఉందని చెప్పాలి. ప్రభాస్ అన్నయ్య ప్రమోద్ ఈ ప్రొడక్షన్ నుంచి ముగ్గురు నిర్మాతలలో ఒకరిగా ఉన్నాడు. ఇక యూవీ క్రియేషన్స్ ప్రభాస్ తో సాహో, రాధేశ్యామ్ సినిమాలు నిర్మించింది. రెండు భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమాలే. అయితే ఈ మూవీస్ రెండు కూడా కమర్షియల్ గా సక్సెస్ అందుకోలేదు.

రాధేశ్యామ్ అయితే డిజాస్టర్ అయ్యింది. దీంతో యూవీ క్రియేషన్స్ ఈ మూవీ కారణంగా చాలా నష్టపోయింది. దీంతో ఆర్ధికంగా ఇబ్బందులు ఎక్కువైపోయి యూవీ క్రియేషన్స్ నుంచి ఇద్దరు నిర్మాతలు సపరేట్ అయిపోయి వేరొకరితో కలిసి కొత్త ప్రొడక్షన్ హౌస్ లు స్టార్ట్ చేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు యూవీ క్రియేషన్స్ ఆర్ధిక ఇబ్బందులని డార్లింగ్ ప్రభాస్ రెండు డీల్స్ తో క్లోజ్ చేసాడని తెలుస్తోంది.

ఆదిపురుష్ మూవీ కి నిర్మాణ భాగస్వామిగా యూవీ క్రియేషన్స్ ఉంది. అయితే ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయలేని సిచువేషన్ లో యూవీ ఉందంట. దీంతో ఆదిపురుష్ తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ రైట్స్ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కి ఇచ్చేశారు. ఏకంగా 170 కోట్ల డీల్ కుదుర్చుకొని అవుట్ రేట్ కి రైట్స్ ఇచ్చేశారు. దీంతో పాటుగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేస్తోన్న స్పిరిట్ మూవీ తెలుగు రైట్స్ ని కూడా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కి ఇచ్చారంట.

ఈ రెండు డీల్స్ ద్వారా యూవీ క్రియేషన్స్ కి పెద్ద మొత్తంలో డబ్బు సమకూరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యూవీ వారికి రాధేశ్యామ్ తో వచ్చిన నష్టాలని పూడ్చుకొని రికవరీ అయినట్లు టాక్. దీంతో మరల పెర్ఫెక్ట్ ప్లానింగ్ తో సినిమాలు ప్లాన్ చేయాలని అనుకుంటున్నారంట. ఏది ఏమైనా యూవీ క్రియేషన్స్ వెనుక ప్రభాస్ ఉండటంతో ఆ ప్రొడక్షన్ హౌస్ ఇప్పుడు రెండు పెద్ద డిజాస్టర్ ల తర్వాత కూడా మెల్లగా కోలుకుంటుంది.

ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ నుంచి అనుష్కశెట్టి, నవీన్ పొలిశెట్టి కాంబినేషన్ లో తెరకెక్కిన మిస్టర్ అండ్ మిస్సెస్ శెట్టి మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. అలాగే యూవీ కాన్సెప్ట్స్ నుంచి అనగనగా ఒక రాజు అనే మూవీ నవీన్ తో తెరకెక్కిస్తున్నారు.