Begin typing your search above and press return to search.
ప్రభాస్.. దీపికా పదుకొణె.. రెండు సీక్రెట్లు!
By: Tupaki Desk | 23 Jan 2021 8:53 AM GMTరెబల్ స్టార్ ప్రభాస్ గతంలో ఎన్నడూ లేనంత దూకుడును ప్రదర్శిస్తున్నాడు. మనోడి టైం టేబుల్ చూస్తుంటే.. రోజుకు 24 గంటలు సరిపోవట్లేదు అనేవారి జాబితాలో చేరిపోయేట్టున్నాడు! అంత హెక్టిక్ షెడ్యూల్ తో వరుస సినిమాలు ప్రకటించాడు. షూట్ కూడా అదేవిధంగా కొనసాగుతోంది.
మన డార్లింగ్ అప్ కమింగ్ మూవీ ‘రాధేశ్యామ్’. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రస్తుతం ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది. ఈ సినిమా పూర్తికాకుండానే.. సెన్సేషన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో ‘సలార్’ స్టార్ట్ చేసేశాడు. ఇటీవలే కొబ్బరికాయ కొట్టిన ఈ మూవీ రెగ్యులర్ షూట్.. అతి త్వరలో ప్రారంభం కాబోతోంది. ఈ చిత్రం కోసం 60 రోజులపాటు కంటిన్యూస్ గా షూటింగ్ లో పాల్గొంటాడు ప్రభాస్.
ఇక, ఈ రెండు సినిమాలు లైన్లో ఉండగానే.. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్’ను తెరపైకి తెచ్చాడు. ఈ సినిమా కోసం కూడా తన కాల్షీట్ నుంచి 60 రోజులు కేటాయించాడు రెబల్ స్టార్. ఈ రెండు సినిమాలను వచ్చే సెప్టెంబర్ నాటికి కంప్లీట్ చేయాలనే టార్గెట్ తో పక్కా ప్రణాళిక రూపొందించుకున్నాడు.
ఈ మూడు సినిమాలతోపాటు సెట్స్ పైకి రాబోతున్న మరో మూవీ నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్. బాలీవుడ్ నటి దీపికా పదుకొణెతో ప్రభాస్ రొమాన్స్ చేయబోతున్న ఈ చిత్రంపై కూడా అభిమానుల్లో అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ మూవీ గురించి ఇంట్రస్టింగ్ ట్వీట్ చేశాడు దర్శకుడు.
ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ ప్రాజెక్టు గురించి సంక్రాంతి తర్వాత అద్దిరిపోయే అప్డేట్ ఇస్తానని చెప్పాడు దర్శకుడు నాగ్ అశ్విన్. అయితే.. లేటెస్ట్ గా స్పందించిన నాగ్ అశ్విన్.. రెండు అప్డేట్స్ ఇవ్వబోతున్నానని ట్వీట్ చేశాడు. అందులో ఒకటి జనవరి 29న, మరొకటి ఫిబ్రవరి 26 న అని ఫ్యాన్స్ లో ఉత్కంఠ రేకెత్తించాడు.
దీంతో.. ఆ రెండు అప్డేట్స్ ఏమై ఉంటాయబ్బా? అని ఆలోచనలో పడిపోయారు అభిమానులు. అయితే.. మెజారిటీ మెంబర్స్ థింక్ చేస్తున్నది ఏమంటే.. ఒక అప్డేట్ షూటింగ్ ప్రారంభం గురించి కావొచ్చని అనుకుంటున్నారు. ఇక రెండో అప్డేట్ సినిమా టైటిల్ కావొచ్చని ఊహిస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.
మన డార్లింగ్ అప్ కమింగ్ మూవీ ‘రాధేశ్యామ్’. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రస్తుతం ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది. ఈ సినిమా పూర్తికాకుండానే.. సెన్సేషన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో ‘సలార్’ స్టార్ట్ చేసేశాడు. ఇటీవలే కొబ్బరికాయ కొట్టిన ఈ మూవీ రెగ్యులర్ షూట్.. అతి త్వరలో ప్రారంభం కాబోతోంది. ఈ చిత్రం కోసం 60 రోజులపాటు కంటిన్యూస్ గా షూటింగ్ లో పాల్గొంటాడు ప్రభాస్.
ఇక, ఈ రెండు సినిమాలు లైన్లో ఉండగానే.. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్’ను తెరపైకి తెచ్చాడు. ఈ సినిమా కోసం కూడా తన కాల్షీట్ నుంచి 60 రోజులు కేటాయించాడు రెబల్ స్టార్. ఈ రెండు సినిమాలను వచ్చే సెప్టెంబర్ నాటికి కంప్లీట్ చేయాలనే టార్గెట్ తో పక్కా ప్రణాళిక రూపొందించుకున్నాడు.
ఈ మూడు సినిమాలతోపాటు సెట్స్ పైకి రాబోతున్న మరో మూవీ నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్. బాలీవుడ్ నటి దీపికా పదుకొణెతో ప్రభాస్ రొమాన్స్ చేయబోతున్న ఈ చిత్రంపై కూడా అభిమానుల్లో అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ మూవీ గురించి ఇంట్రస్టింగ్ ట్వీట్ చేశాడు దర్శకుడు.
ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ ప్రాజెక్టు గురించి సంక్రాంతి తర్వాత అద్దిరిపోయే అప్డేట్ ఇస్తానని చెప్పాడు దర్శకుడు నాగ్ అశ్విన్. అయితే.. లేటెస్ట్ గా స్పందించిన నాగ్ అశ్విన్.. రెండు అప్డేట్స్ ఇవ్వబోతున్నానని ట్వీట్ చేశాడు. అందులో ఒకటి జనవరి 29న, మరొకటి ఫిబ్రవరి 26 న అని ఫ్యాన్స్ లో ఉత్కంఠ రేకెత్తించాడు.
దీంతో.. ఆ రెండు అప్డేట్స్ ఏమై ఉంటాయబ్బా? అని ఆలోచనలో పడిపోయారు అభిమానులు. అయితే.. మెజారిటీ మెంబర్స్ థింక్ చేస్తున్నది ఏమంటే.. ఒక అప్డేట్ షూటింగ్ ప్రారంభం గురించి కావొచ్చని అనుకుంటున్నారు. ఇక రెండో అప్డేట్ సినిమా టైటిల్ కావొచ్చని ఊహిస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.