Begin typing your search above and press return to search.

పూజా ఓపికను మెచ్చుకోవాల్సిందే

By:  Tupaki Desk   |   28 Oct 2021 4:36 AM GMT
పూజా ఓపికను మెచ్చుకోవాల్సిందే
X
టాలీవుడ్ తో పాటు కోలీవుడ్‌ మరియు బాలీవుడ్‌ లో కూడా సినిమాలు చేస్తూ మోస్ట్‌ బిజీ హీరోయిన్‌ ఆఫ్‌ ఇండియా అని పేరు దక్కించుకున్న ముద్దుగుమ్మ పూజా హెగ్డే అనే విషయంలో ఎలాంటి డౌట్ లేదు. తెలుగు లో వరుసగా సినిమాలు చేస్తూనే మరో వైపు హిందీలో ఇంకా తమిళంలో కూడా పెద్ద సినిమా ల్లో నటిస్తున్న ఈమె ముంబయిలో తన డ్రీమ్‌ హోమ్‌ రూపకల్పనలో కూడా పాలు పంచుకుంటుంది. సినిమాలు షూటింగ్‌ లతో ఇంత బిజీగా ఉన్న పూజా హెగ్డే తన డ్రీమ్‌ హోం పనుల్లో కూడా పాలు పంచుకుంటుంది. తాజాగా పూజా హెగ్డే షేర్ చేసిన ఫొటోల్లో తన ఇంటికి సంబంధించిన పెయింటింగ్స్ పనులు చూసుకుంటూ ఉంది. తన అభిరుచికి తగ్గట్లుగా పెయింటింగ్స్ ను వేయించుకుంటూ కనిపించింది.

సాదారణంగా హీరోయిన్స్ ఇలాంటి పనులను తమ వారికి అప్పగిస్తారు. కాని పూజా హెగ్డే మాత్రం తన ఇంటి పనులు తానే చూసుకుంటూ ఉంది. షూటింగ్ లతో ఎంత బిజీగా ఉన్నా కూడా రోజు కొంత సమయం అయినా కూడా ఇంటి పనులకు ఆమె కేటాయిస్తున్నట్లుగా ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఇలా చేయాలి అలా చేయాలని చెప్పకుండా అన్ని దగ్గర ఉండి చూసుకుంటుందట. షూటింగ్ లతో అంతగా అలసి పోయి కూడా ఇంటి పనులను చూసుకుంటుంది అంటే ఖచ్చితంగా పూజా హెగ్డే ఓపికకు మెచ్చుకోవాల్సిందే అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. కష్టపడితేనే అనుకున్నది సాధ్యం అవుతుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరీర్ ఆరంభం నుండి పూజా హెగ్డే చాలా కష్టపడింది. అందుకే ఇప్పుడు స్టార్ గా నిలిచింది. అందుకే తన ఇంటి కోసం కూడా ఆమె కష్టపడుతుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్ సినిమా విడుదల అయ్యి సక్సెస్ టాక్‌ ను దక్కించుకుంది. సినిమా లో ఆమె పాత్ర కు మంచి మార్కులు పడ్డాయి. మొదటి సారి మంచి నటనతో ఆకట్టుకుంది అంటూ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. పూజా హెగ్డే నటించిన రాధే శ్యామ్‌ సినిమా విడుదలకు కూడా సిద్దం అయ్యింది. ఆచార్య సినిమా లో కూడా ఈమె చిన్న గెస్ట్‌ రోల్‌ లో చరణ్‌ కు జోడీగా నటించింది. తమిళం లో స్టార్‌ హీరో సినిమా లో ఈమె నటిస్తున్న విషయం తెల్సిందే. షూటింగ్‌ లతో ఇంత బిజీగా ఉంటూనే మరో వైపు తన ఇంటిని సిద్దం చేసుకుంటుంది. ఒకటి రెండు నెలల్లోనే పూజా హెగ్డే ఇల్లు పూర్తి అవుతుందని తెలుస్తోంది. ముంబయిలోని అత్యంత ఖరీదైన ఏరియాలో ఈమె ఇల్లు నిర్మాణం చేసుకుందట. అక్కడ బాలీవుడ్‌ కు చెందిన ప్రముఖుల ఇల్లు ఉన్నట్లుగా చెబుతున్నారు.