Begin typing your search above and press return to search.

కోలకళ్ల భామ కోలీవుడ్లోను చక్రం తిప్పేస్తుందేమో!

By:  Tupaki Desk   |   5 March 2021 12:30 PM GMT
కోలకళ్ల భామ కోలీవుడ్లోను చక్రం తిప్పేస్తుందేమో!
X
ఇంటినుంచి వెళ్లిపోయి ఎన్నాళ్లకి తిరిగొచ్చినా హ్యాపీగా వెల్ కమ్ చెబుతారుగానీ, ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయి తిరిగొస్తే మాత్రం అంతా కొత్తగా చూస్తారు. అంతకుముందు అసలు పరిచయమే లేనట్టుగా చేస్తారు. కానీ పూజా హెగ్డే విషయంలో అలా జరగకపోవడం విశేషం. తెలుగులో ట్రాకులో పడుతున్న సమయంలోనే ఆమె బాలీవుడ్ లో భారీ అవకాశం అంటూ అటువైపు పరిగెత్తింది. అక్కడ ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటంతో, ఆమె కళ్లు భళ్లున తెరుచుకున్నాయి. దాంతో మళ్లీ టాలీవుడ్ కి పరిగెత్తుకు వచ్చింది.

అదృష్టం బాగుండి 'దువ్వాడ జగన్నాథం'తో అవకాశం చిక్కడం .. హిట్ దక్కడంతో దూకుడు పెంచేసింది. ఆ తరువాత నుంచి ఆమె వరుసగా స్టార్ హీరోలతో ఆడిపాడుతూ వెళుతోంది. ఒక సినిమాకి మించిన వసూళ్లు మరో సినిమా సాధిస్తూ ఉండటంతో, ఆమె డిమాండ్ అంతకంతకూ పెరుగుతూ వెళుతోంది. తెలుగులో ఆమె చేసిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' .. 'రాధేశ్యామ్' .. 'విడుదలకి ముస్తాబవుతున్నాయి. ఇక చరణ్ జోడీగా చేస్తున్న 'ఆచార్య' సినిమా సెట్స్ పై ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా ఆమె పేరునే వినిపిస్తోంది.

అదృష్టం అందుబాటులో ఉన్నప్పుడే అన్ని పనులను మొదలెట్టేయాలనే ఉద్దేశంతో, మళ్లీ కోలీవుడ్ పై ఓ లుక్కేసింది. తమిళంలో విజయ్ హీరోగా రూపొందుతున్న ఆయన 65వ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. చాలామంది హీరోయిన్ల పేర్లను పరిశిలించి చివరికి పూజా హెగ్డేను ఫైనల్ చేశారు. పారితోషికంగా ఆమె మూడున్నర కోట్లు అందుకుంటున్నట్టు చెబుతున్నారు. కోలీవుడ్లో ఈ పారితోషికం అందుకోవడానికి నయనతారకే చాలా కాలం పట్టింది. అలాంటిది చాలా తక్కువ సమయంలోనే తమిళంలో పూజా హెగ్డే ఈ స్థాయి పారితోషికాన్ని అందుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది.