Begin typing your search above and press return to search.

వర్మ టీజర్‌ లను కూడా జనాలు లైట్ తీసుకుంటున్నారు

By:  Tupaki Desk   |   25 Jan 2021 4:30 AM GMT
వర్మ టీజర్‌ లను కూడా జనాలు లైట్ తీసుకుంటున్నారు
X
వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ సినిమాలపై జనాలకు ఆసక్తి తగ్గింది. రెండు దశాబ్దాల క్రితం వరకు వర్మ సినిమా అంటే జనాలు ఎదురు చూసేవారు. కాని ఇప్పుడు ఆయన వరుసగా చేస్తున్న సినిమాలే ఆయనపై గౌరవంను పోగొట్టాయి ఆయనపై ప్రేక్షకుల్లో ఉన్న నమ్మకంను తగ్గించాయి అనడంలో సందేహం లేదు. ఒకప్పుడు ఆయన సినిమాలు విపరీతంగా చూసేవారు. ఆ తర్వాత తర్వాత వర్మ సినిమాలను లైట్ తీసుకుంటూ వచ్చారు. అయితే వర్మ ట్రైలర్‌ మరియు టీజర్ తో ఆకట్టుకుంటూ సినిమాలనే అందులో చూపించే వాడు. దాంతో ఆయన సినిమాల ట్రైలర్‌ మరియు టీజర్‌ లకు మంచి ఆధరణ ఉండేది. కాని ఇప్పుడు అది కూడా తగ్గిపోయిందేమో అనిపిస్తుంది.

రామ్ గోపాల్‌ వర్మ సారధ్యంలో రాబోతున్న 'డి కంపెనీ' సినిమా టీజర్‌ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఈ టీజర్‌ ను తెలుగు మరియు హిందీ వర్షన్ ల్లో విడుదల చేశారు. తెలుగు వర్షన్ ను రామ్‌ గోపాల్ వర్మ తన అఫిసియల్ యూట్యూబ్‌ ఛానెల్‌ లో పోస్ట్‌ చేశారు. ఈమద్య కాలంలో చిన్న వీడియోలకు వెబ్ సిరీస్ ల వీడియోలకు టీజర్‌ లకు ట్రైలర్‌ లకు కూడా గంటల వ్యవధిలో లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. మొదటి రోజు దాటకముందే మిలియన్‌ వ్యూస్ ను క్రాస్‌ చేస్తున్నాయి. ఈమద్య కాలంలో మిలియన్ వ్యూస్‌ అనేది చాలా కామన్‌ అయ్యింది. అలాంటిది వర్మ డి కంపెనీ టీజర్‌ మాత్రం రెండు రోజులు అయినా కనీసం హాఫ్‌ మిలియన్ వ్యూస్ ను కూడా దక్కించుకోలేక పోయింది. వర్మను నెటిజన్స్‌ కూడా నిదానంగా పక్కకు పెడుతున్నారని.. లైట్ తీసుకుంటున్నట్లుగా అనిపిస్తుందని మీడియా వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.