Begin typing your search above and press return to search.

ఈ బిజీలో.. OG మాత్రమేనా?

By:  Tupaki Desk   |   9 Jun 2023 7:00 PM GMT
ఈ బిజీలో.. OG మాత్రమేనా?
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. వీటి లో ఇప్పటికే బ్రో మూవీ కంప్లీట్ చేసి జులై 28న ప్రేక్షకుల ముందుకి రావడాని కి రెడీ అవుతున్నారు. ఈ మూవీ కి డబ్బింగ్ కూడా పవర్ స్టార్ రీసెంట్ గా ఫినిష్ చేసేశారు. ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో ఓజీ మూవీ తో పాటు గా ఉస్తాద్ భగత్ సింగ్ కూడా హరీష్ శంకర్ స్టార్ట్ చేశారు. ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ కి ఒకదాని తర్వాత డేట్స్ పవన్ కళ్యాణ్ ఇస్తాడని అందరూ భావించారు.

అయితే పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత క్రమం చూసుకుంటే ప్రస్తుతం మారుతున్నట్లు కనిపిస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ తమిళ్ హిట్ మూవీ తెరికి రీమేక్ అనే సంగతి తెలిసిందే. అలాగే త్వర లో రిలీజ్ కాబోతున్న బ్రో మూవీ కూడా తమిళ్ హిట్ మూవీ రీమేక్ గానే వస్తోంది. ఈ నేపథ్యంలో బ్రో తర్వాత వెంటనే మళ్ళీ రీమేక్ సినిమా ని రిలీజ్ చేస్తే బాగుండదని పవన్ కళ్యాణ్ భావిస్తున్నాడంట.

ఈ నేపథ్యం లో సుజిత్ దర్శకత్వంలో స్ట్రైట్ కథతో చేస్తోన్న ఓజీ సినిమా ని ముందుగా కంప్లీట్ చేయాల ని డిసైడ్ అయ్యాడు. అందుకే టైమ్ గ్యాప్ తీసుకోకుండా బ్యాక్ టూ బ్యాక్ కాల్ షీట్స్ ని ఓజీ మూవీ కోసం ఇస్తున్నాడు. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ ఓజీ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. మళ్ళీ జూన్ 13 వరకు నెక్స్ట్ షెడ్యూల్ కోసం పవన్ కళ్యాణ్ కాల్ షీట్స్ ని ఓజీ కోసమే ఇచ్చాడంట.

హరీష్ శంకర్ అయితే ఉస్తాద్ భగత్ సింగ్ కోసం ఏకంగా భారీ సెట్ వేసుకొని షూటింగ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అయితే వారాహి యాత్ర జూన్ 10 నుంచి పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేయబోతున్నాడు. మొదటి విడత యాత్ర కంప్లీట్ చేసిన తర్వాత మరల ఓ నెల రోజుల పాటు కంప్లీట్ గా షూటింగ్స్ కోసం టైమ్ స్పెండ్ చేయనున్నారంట.

ఆ టైమ్ లో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కి కాల్ షీట్స్ ని పవన్ కళ్యాణ్ ఇచ్చే ఛాన్స్ ఉందని బోగట్టా. అంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తోన్న ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ లలో ఫస్ట్ ప్రయారిటీ మాత్రం సుజిత్ కే ఇచ్చాడు. ఇక క్రిష్ దర్శకత్వంలో చేస్తోన్న హరిహర వీరమల్లు గురించి ప్రస్తుతం ఎలాంటి సౌండ్ వినిపించడం లేదు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఎన్నికల తర్వాతనే ఆ మూవీ షూటింగ్ ప్రేక్షకులకి అందించే ఛాన్స్ ఉందనే ప్రచారం నడుస్తోంది.