Begin typing your search above and press return to search.

2 భాగాలుగా పవన్​ OG.. టెర్రిఫిక్​ క్లైమాక్స్​కు ప్లాన్

By:  Tupaki Desk   |   31 Jan 2023 12:01 PM GMT
2 భాగాలుగా పవన్​ OG.. టెర్రిఫిక్​ క్లైమాక్స్​కు ప్లాన్
X
పవర్ స్టార్​ పవన్‌ కల్యాణ్‌- సాహో డైరెక్టర్ సుజీత్‌ కాంబినేషన్‌లో భారీ యాక్షన్‌ డ్రామా​ చిత్రం 'OG' రూపొందుతున్న సంగతి తెలిసిందే. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. తమన్‌ స్వరాలందిస్తున్నారు. ఈ సినిమా సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో గ్రాండ్​గా ప్రారంభమైంది. అయితే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా పంజా, సాహా లాంటి అవుట్​ పుట్​ కాకుండా కేజీయఫ్, పఠాన్​ లాంటి ఫలితం దక్కాలని అభిమానులు ఆశిస్తున్నారు.

మరో ఆసక్తికర విషయమేమిటంటే ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతున్నట్లు తెలుస్తోంది. తొలి భాగాన్ని త్వరగా పూర్తి చేసి ఈ దసరాకు విడుదల చేయాలని ప్లాన్​ చేస్తున్నారట. దీని కోసం భారీగా పవన్ డేట్స్​ కోవాలని సుజిత్​ కోరారట. ఈ తొలి భాగంలో ఓ టెర్రిఫిక్​ క్లైమాక్స్​ను ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. అదే ఈ చిత్రానికి హైలైట్ కానుందట. ఎలాగైనా ఈ చిత్రం హిట్​ కొట్టి భారీగా కమ్​ బ్యాక్​ ఇవ్వాలని సుజిత్​ భావిస్తున్నారట. మరి ఏం జరుగుతందో చూడాలి.

ఇక ఈ సినిమా విషయానికొస్తే.. ఒక్క అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌తోనే సోషల్‌ మీడియా షేక్‌ అయింది. సాహో లాంటి హై యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ తర్వాత దాదాపు నాలుగేళ్లు విరామం తీసుకుని సుజిత్‌ ఈ కథను సిద్ధం చేశాడు. ఇందులో పవన్​ గ్యాంగ్​స్టర్​గా కనిపించనున్నారని టాక్​ వినిపిస్తోంది. పైగా అతడు పవన్‌కు సుజీత్‌ వీరాభిమాని కావడంతో ఈ సినిమా ఏ లెవల్లో ఉంటుందో అని అభిమానులందరూ భారీగా ఎక్స్‌పెక్టేషన్స్‌ పెట్టుకుంటున్నారు.

ఇంకా ఆర్​ఆర్​ఆర్​ లాంటి భారీ హిట్​ అందుకున్న తర్వాత డీవీవీ.. ఈ సినిమా చేయడం కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరో విషమేమిటంటే.. ఈ సినిమా నిర్మాణంలో అల్లు అరవింద్ కూడా భాగస్వామ్యం కానున్నారని ప్రచారం సాగుతోంది. ఆయన సైలెంట్​గా బడ్జెట్​తో పెట్టబడులు పెట్టనున్నారని కథనాలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలీదు.

ఇకపోతే గ్రాండ్​గా జరిగిన మూవీ లాంఛ్ ఈవెంట్​లో ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్‌ క్లాప్‌ కొట్టగా.. సురేష్ బాబు కెమెరా స్విచ్చాన్‌ చేశారు. దిల్‌రాజు, అరవింద్‌ దర్శక నిర్మాతలకు స్క్రిప్ట్‌ అందించారు.

ఈ మూవీ లాంచ్​ ఈవెంట్​లో ​పవన్‌ గ్రాండ్‌ ఎంట్రీ పిక్స్​ సోషల్​మీడియాలో వైరల్​ అయ్యాయి. ఫ్యాన్స్​ ఫుల్ ఖుషీ అయ్యారు. పవన్​ ఈజ్​ బ్యాక్​, యంగ్ లుక్​లో కనిపిస్తున్నారని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో హరీష్‌ శంకర్‌, శ్రీవాస్‌, వివేక్‌ ఆత్రేయ, బీవీఎస్ఎన్‌ ప్రసాద్‌, ఏఎం రత్నం తదితరులు పాల్గొన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.