Begin typing your search above and press return to search.
ట్రెండీ టాక్: ఆదిపురుష్ 3డి కి ప్రభాస్ పారితోషికం ఎంత?
By: Tupaki Desk | 26 Nov 2020 5:45 AM GMTభారీ చిత్రాల్లో నటించేప్పుడు కథానాయకుల షేర్ భారీ మొత్తమే ఉంటుంది. పారితోషికం.. దాంతోపాటే లాభాల్లో వాటాలు అంటూ చాలానే డిమాండ్లు ఉంటాయి. ఇక బాహుబలి లాంటి పాన్ ఇండియా సినిమాలో నటించాక ప్రభాస్ రేంజు అమాంతం పదింతలైంది. బాహుబలి సిరీస్ కోసం భారీగా ప్యాకేజీ అందుకున్న ప్రభాస్ ఆ తర్వాత సాహో సొంత బ్యానర్ లో నిర్మించారు. అయితే ఆ సినిమా ఆశించినంత రేంజుకు వెళ్లకపోవడంతో కొంతవరకూ డార్లింగ్ సర్ధుబాట్లు చేయాల్సి వచ్చిందన్న ప్రచారం సాగింది.
అయితేనేం.. ఇప్పుడు వరుసగా భారీ పాన్ ఇండియా సినిమాలకు సంతకాలు చేస్తూ టాలీవుడ్ హీరోల్లోనే ది బెస్ట్ గా ఆర్జిస్తున్నాడన్న ప్రచారం సాగుతోంది. అయితే ఇందుకు భిన్నంగా ప్రభాస్ ఆదిపురుష్ 3డిలో నటిస్తున్నందుకు పెద్ద రేంజు పారితోషికం అందుకోవడం లేదంటూ ప్రచారం సాగుతోంది.
ఆదిపురుష్ జనవరి నుండి రెగ్యులర్ చిత్రీకరణకు వెళుతోంది. ఈ ఫాంటసీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ప్రభాస్ అవతార్ తరహా స్పెషల్ లుక్ లో కనిపించనున్నాడు. నీలి మేఘ శ్యాముడైన శ్రీరాముని పోలి కనిపిస్తాడన్న లీకులు అందాయి. దీనికోసం ఇప్పటికే మేకోవర్ చేస్తున్నాడు.
ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ డమ్ కి తగ్గట్టే మేకర్స్ భారీ మొత్తాన్ని చెల్లిస్తున్నారని తెలుస్తోంది. పారితోషికంతో పాటు లాభాల్లో వాటాను పంచుకోనున్నారు. ఆ మేరకు నిర్మాతలతో ప్రభాస్ ఒప్పందం కుదిరిందట. పారితోషికంగానే భారీ మొత్తం చేతికందుతుంది. ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అవుతుంది అన్నదానిని బట్టి ప్రభాస్ కి ఆదాయం పెరుగుతుంది. తానాజీ ఫేం ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా ఇందులో సైఫ్ అలీ ఖాన్ నెగటివ్ రోల్ పోషించనున్నారు.
అయితేనేం.. ఇప్పుడు వరుసగా భారీ పాన్ ఇండియా సినిమాలకు సంతకాలు చేస్తూ టాలీవుడ్ హీరోల్లోనే ది బెస్ట్ గా ఆర్జిస్తున్నాడన్న ప్రచారం సాగుతోంది. అయితే ఇందుకు భిన్నంగా ప్రభాస్ ఆదిపురుష్ 3డిలో నటిస్తున్నందుకు పెద్ద రేంజు పారితోషికం అందుకోవడం లేదంటూ ప్రచారం సాగుతోంది.
ఆదిపురుష్ జనవరి నుండి రెగ్యులర్ చిత్రీకరణకు వెళుతోంది. ఈ ఫాంటసీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ప్రభాస్ అవతార్ తరహా స్పెషల్ లుక్ లో కనిపించనున్నాడు. నీలి మేఘ శ్యాముడైన శ్రీరాముని పోలి కనిపిస్తాడన్న లీకులు అందాయి. దీనికోసం ఇప్పటికే మేకోవర్ చేస్తున్నాడు.
ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ డమ్ కి తగ్గట్టే మేకర్స్ భారీ మొత్తాన్ని చెల్లిస్తున్నారని తెలుస్తోంది. పారితోషికంతో పాటు లాభాల్లో వాటాను పంచుకోనున్నారు. ఆ మేరకు నిర్మాతలతో ప్రభాస్ ఒప్పందం కుదిరిందట. పారితోషికంగానే భారీ మొత్తం చేతికందుతుంది. ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అవుతుంది అన్నదానిని బట్టి ప్రభాస్ కి ఆదాయం పెరుగుతుంది. తానాజీ ఫేం ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా ఇందులో సైఫ్ అలీ ఖాన్ నెగటివ్ రోల్ పోషించనున్నారు.