Begin typing your search above and press return to search.

#PSPKRana రిలీజ్ డేట్ ఫిక్స్.. మహేష్-ప్రభాస్ కంటే ముందే పవన్..!

By:  Tupaki Desk   |   2 Aug 2021 4:08 PM GMT
#PSPKRana రిలీజ్ డేట్ ఫిక్స్.. మహేష్-ప్రభాస్ కంటే ముందే పవన్..!
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 'అయ్యప్పనుమ్ కోషియమ్' అనే మలయాళ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మల్టీస్టారర్ లో మరో హీరోగా రానా దగ్గుబాటి నటిస్తున్నారు. '#PSPKRana' అనే వర్కిగ్ టైటిల్ తోతెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. 2022 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇటీవలే మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలో విడుదల తేదీని ఖరారు చేశారు.

'అతిపెద్ద ఆత్మగౌరవ యుద్ధానికి సన్నద్ధం అవ్వండి' అంటూ 2022 జనవరి 12న #PSPKRana చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా త్వరలో ఫస్ట్ సింగిల్ ని కూడా విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ మేకర్స్ ఓ వీడియో వదిలారు. ఇందులో థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తుండగా.. పోలీస్ డ్రెస్ లో ఉన్న పవన్ పక్కనే కూర్చొని ఉన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ - సింగర్ శ్రీకృష్ణ కూడా వారితో పాటు కనిపిస్తున్నారు.

కాగా, ఇప్పటికే సంక్రాంతి బరిలో మహేష్ బాబు - ప్రభాస్ వంటి ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఉన్నాయి. 'సర్కారు వారి పాట' చిత్రాన్ని జనవరి 13న.. 'రాధే శ్యామ్' మూవీని జనవరి 14న విడుదల చేయనున్నారు. ఇప్పుడు వాటి కంటే ఒకరోజు ముందు పవన్ సినిమా థియేటర్లలోకి వస్తున్నట్లు తెలిపారు. ముగ్గురు స్టార్ హీరోలు కలిసి వస్తున్న 2022 సంక్రాంతి.. సినీ ప్రేమికులకు బొనాంజా అని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో వీరికి పోటీగా మరేదైనా చిత్రాన్ని తీసుకొస్తారేమో చూడాలి.

'ఏకే' రీమేక్ కు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - మాటలు అందిస్తున్నారు. అహం ఆత్మాభిమానం వల్ల ఇద్దరు వ్యక్తుల జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసున్నాయనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా.. రిటైర్ట్ హవల్దార్‌ పాత్రలో రానా కనిపించనున్నారు. వీరికి జోడీగా నిత్యామీనన్ - ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు.

ఎస్ ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. రవి కె.చంద్రన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.12 గా ఈ సినిమా రూపొందుతోంది. సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు