Begin typing your search above and press return to search.

'ప్రభాస్-నాగ్ అశ్విన్' సినిమా గురించి ఫ్యాన్స్ నిరాశ పడుతున్నారా..?

By:  Tupaki Desk   |   2 Aug 2020 12:30 AM GMT
ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా గురించి ఫ్యాన్స్ నిరాశ పడుతున్నారా..?
X
సాహో తర్వాత డార్లింగ్ ప్రభాస్.. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో 'రాధేశ్యామ్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా పీరియాడిక్ లవ్ స్టోరీగా రూపొందుతుంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్.. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో నటించబోతున్నాడు. ఈ ఏడాది చివరలో సినిమా షూటింగ్ ప్రారంభిచాలని ప్లానింగులో ఉన్న ఈ మూవీ సైంటిఫిక్ థ్రిల్లర్ గా రూపొందనుంది. ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ హీరో పాత్రలో కనిపించనున్నాడట. సైన్స్ ఫిక్షన్ జానర్ కాబట్టి గ్రాఫికల్ విసువల్ వండర్ గా రూపొందిస్తారట. అయితే ఈ సినిమాను ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల చేయనున్నారట. అయితే ప్రస్తుతం భారీ లెవల్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా గురించి రోజు ఏదొక వార్త వైరల్ అవుతోంది. ముఖ్యంగా ప్రభాస్ సరసన నటించబోయే హీరోయిన్ గురించి ఒకటే చర్చ.

అయితే ప్రభాస్ సరసన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నటించనుంది. ప్రస్తుతం బాలీవుడ్లో టాప్ హీరోయినుగా కొనసాగుతున్న దీపిక సౌత్ ఇండియన్ స్టార్ తో నటించడానికి ఓకే చెప్పిందంటే అంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే కూడా రెమ్యూనరేషన్ భారీగానే తీసుకుంటుంది. అంటే ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితులలో కేవలం హీరోయినుకే భారీ మొత్తం చెల్లించడం అనేది సినిమా పై ఆర్థిక ప్రభావం చూపించనుందని అంటున్నారు. అలాగే ప్రభాస్ సరసన బాలీవుడ్ హీరోయిన్లు నటించిన సినిమాలు ప్లాప్ అవుతున్నాయని డార్లింగ్ ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారట. అందులో భాగంగానే ఏక్ నిరంజన్, సాహో సినిమాలు దెబ్బ తిన్నాయని టాక్. అయితే ఇప్పుడు మళ్లీ దీపిక పదుకోనె హీరోయిన్ అనేసరికి కాస్త టెన్షన్ పడుతున్నారు. కానీ రాధేశ్యామ్ సినిమాలో కూడా పూజా హెగ్డే నటిస్తుంది. మరి ఆమె బాలీవుడ్ కాదా.. అంటూ మరోవైపు ఆలోచిస్తున్నారు. చూడాలి మరి వీటికి దర్శక నిర్మాతలు ఎలాంటి సమాధానం ఇస్తారో..!