Begin typing your search above and press return to search.

త్వరలో పాన్ ఇండియా వైడ్ పరిచయం కానున్న తెలుగు హీరోయిన్!

By:  Tupaki Desk   |   2 July 2020 11:30 PM GMT
త్వరలో పాన్ ఇండియా వైడ్ పరిచయం కానున్న తెలుగు హీరోయిన్!
X
తెలుగు ప్రేక్షకులకు ‘అలా మొదలైంది’ సినిమాతో పరిచయమైన బొద్దుగుమ్మ నిత్యా మీనన్. మొదటి సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకులలో మంచి క్రేజ్ సంపాదించింది. ఈ కేరళ కుట్టి నితిన్ సరసన ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలతో యువత హృదయాలలో చిరస్థానం సంపాదించుకుంది. ఇక ఆ సినిమా తర్వాత తెలుగు వైపు అంతగా ఫోకస్ చేయలేదు ఈ బ్యూటీ. చివరగా గతేడాది బాలీవుడ్ హిట్ ఫిల్మ్ ‘మిషన్ మంగళ్’ సినిమాలో కనిపించిన నిత్య.. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లపై దృష్టి పెట్టిందని కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. అవన్నీ నిజమేనని తన తొలి వెబ్ సిరీస్ ఫస్ట్‌ లుక్ ఇటీవలే రిలీజ్ చేసింది. ‘బ్రీత్ ఇన్ టు ద షాడోస్’ పేరుతో వస్తున్న సిరీస్ ఫస్ట్ లుక్ చాలా ఇంట్రెస్టింగ్‌ క్రియేట్ చేసింది.

పగిలిపోయిన మాస్క్ ముక్కల నడుమ చిన్నారి పడుకుని ఉన్న పోస్టర్ ఆసక్తి రేపుతోంది. నీడలో పడుకుని ఉంటూ.. ఏదో దొరుకుతుందని ఎదురుచూస్తోందనే.. క్యాప్షన్‌తో ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన నిత్య.. ఈ వెబ్ సిరీస్ జులై 10న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలిపింది. బ్రీత్ వెబ్ సిరీస్ మొదటి భాగంలో స్టార్ యాక్టర్ మాధవన్ లీడ్ రోల్ లో నటించాడు. ఇక ప్రస్తుతం అదే వెబ్ సిరీస్ ‘బ్రీత్ వెబ్ సిరీస్’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సిరీస్‌లో స్టార్ యాక్టర్ అభిషేక్ బచ్చన్ తో నిత్యామీనన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ మయాంక్ శర్మ తెరకెక్కించాడు. ఈ సందర్భంగా వెబ్ సిరీస్ పై స్పందిస్తూ నిత్యామీనన్ ఇంస్టాగ్రామ్ ద్వారా ఆనందం వ్యక్తం చేసింది. అమ్మడు వెబ్ సిరీస్ ద్వారా పాన్ ఇండియా వైడ్ అందరినీ పలకరించడం సంతోషంగా ఉందంటోంది. ప్రస్తుతం ఓటిటి ప్రేక్షకులు ఈ వెబ్ సిరీస్ కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.