Begin typing your search above and press return to search.

'సినిమా ఆడుంటే పోస్టర్స్ ఉండేవి బ్రదర్'.. నెటిజన్ ట్వీట్ కి నితిన్ ఫన్నీ రిప్లై..!

By:  Tupaki Desk   |   20 Oct 2020 7:10 AM GMT
సినిమా ఆడుంటే పోస్టర్స్ ఉండేవి బ్రదర్.. నెటిజన్ ట్వీట్ కి నితిన్ ఫన్నీ రిప్లై..!
X
యూత్ స్టార్ నితిన్ ఎంత జోవియల్ గా ఉంటాడో అందరికీ తెలిసిందే. సినిమాల్లో ఎలా నవ్విస్తాడో రియల్ లైఫ్ లో కూడా అలానే బిహేవ్ చేస్తుంటాడు. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే నితిన్.. అప్పుడప్పుడు నెటిజన్స్ అడిగే ప్రశ్నలకు ఫన్నీగా రిప్లై ఇస్తుంటాడు. తాజాగా ఓ నెటిజన్ అడిగిన దానికి కూడా ఫన్నీగా రియాక్ట్ అయ్యాడు. నితిన్ హీరోగా నటించిన మూడో సినిమా 'సంబరం'(2003) గురించి ఓ అభిమాని ట్వీట్ చేస్తూ 'బ్రదర్ సంబరం మూవీ 50డేస్ పేపర్ ప్రింట్స్ ఏమైనా ఉన్నాయా?' అని ప్రశ్నించాడు. దీనికి నితిన్ స్పందిస్తూ ''సినిమా ఆడుంటే ఉండేవి బ్రదర్'' అని ఫన్నీగా సమాధానమిస్తూ 'పేస్ విత్ టియర్స్ ఆఫ్ జాయ్' ఎమోజీ జత చేశాడు. పరోక్షంగా నితిన్ తన 'సంబరం' సినిమా బాగా ఆడలేదని చెప్పాడు. అయితే నితిన్ ఫ్యాన్స్ మాత్రం 'సంబరం' ప్లాప్ అంటే అంగీకరించడం లేదు. సినిమా బాగుంటది అన్నా అని ట్వీట్స్ పెడుతున్నారు.

కాగా, నితిన్ 'భీష్మ' సినిమా సక్సెస్ తో వరుస ప్రాజెక్ట్స్ లైన్లో పెడుతూ దూకుడు చూపిస్తున్నాడు. ప్రస్తుతం మహానటి కీర్తి సురేష్ తో ''రంగ్ దే'' అనే రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైమెంట్స్ బ్యాన‌ర్‌ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన ''అంధాదున్'' మూవీని తెలుగులో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రిమేక్ చేయనున్నాడు. వీటితో పాటు చంద్రశేఖర్ ఏలేటితో 'చెక్' మరియు కృష్ణ చైతన్య దర్శకత్వంలో 'పవర్ పేట' సినిమాలు చేయనున్నాడు నితిన్.