Begin typing your search above and press return to search.
నిశ్శబ్ధం సాంగ్: ఫ్యాన్స్ కి సిద్ శ్రీరామ్ ట్రీట్
By: Tupaki Desk | 14 Dec 2019 3:25 PM GMTస్వీటీ అనుష్క శెట్టి నటిస్తున్న తాజా చిత్రం నిశ్శబ్దం. హేమంత్ మధుకర్ దర్శకుడు. కోనవెంకట్ రచయిత. ఆయనే నిర్మాత. కోన ఫిలింఫ్యాక్టరీ- పీపుల్స్ మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజర్ లో అనుష్క.. అంజలి పాత్రల్ని రివీల్ చేసిన సంగతి తెలిసిందే. అమెరికా సియాటిల్ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ హారర్ బ్యాక్ డ్రాప్ మూవీ ఇది. ఈ చిత్రంలో అనుష్క మూగ యువతి అయిన చిత్రకారిణిగా నటిస్తున్నారు. మాధవన్ మ్యుజీషియన్ గా నటిస్తుండగా.. తెలుగమ్మాయ్ అంజలి సియాటిల్ పోలీస్ వింగ్ లో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా నటిస్తోంది.
అలాగే ఈ చిత్రంలో షాలిని ఈ మూవీలో సోనాలి అనే పాత్రలో కనిపించనుంది. ఓ మర్డర్ కేసులో సాక్షిగా కనిపించనుందా.. లేక ఆత్మ నా అన్న సస్పెన్స్ ని ఆ పాత్రలో లీడ్ చేశారు. నిశ్వబ్ధం సినిమాకి సంబంధించిన ప్రతి ప్రచార చిత్రం .. పోస్టర్ అభిమానుల్లోకి దూసుకెళ్లాయి. 2020 సంక్రాంతి తర్వాత ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు కోన బృందం ప్లాన్ చేస్తోంది.
ఈనెల 17న క్రేజీ సింగర్ సిద్ శ్రీరామ్ ఆలపించిన పాట ప్రోమోని రిలీజ్ చేయనున్నారు. భాస్కర భట్ల ఈ లిరిక్ ని రాశారు. ఆ మేరకు అధికారిక పోస్టర్ ద్వారా వివరాల్ని అందించింది చిత్రబృందం. ఇటీవల టాలీవుడ్ లో పలు చార్ట్ బస్టర్ సాంగ్స్ ని ఆలపించిన సిధ్ శ్రీరామ్ నిశ్శబ్ధం కోసం నిన్నే నిన్నే అంటూ సాగే పాటను ఆలపించారు. కొత్త సంవత్సరం మొదలు నిశ్శబ్ధం ప్రమోషన్ ని కోన టీమ్ మరింత వేడెక్కించనుంది. అప్పుడు స్వీటీ స్వయంగానే బరిలోకి దిగనున్న సంగతి తెలిసిందే.
అలాగే ఈ చిత్రంలో షాలిని ఈ మూవీలో సోనాలి అనే పాత్రలో కనిపించనుంది. ఓ మర్డర్ కేసులో సాక్షిగా కనిపించనుందా.. లేక ఆత్మ నా అన్న సస్పెన్స్ ని ఆ పాత్రలో లీడ్ చేశారు. నిశ్వబ్ధం సినిమాకి సంబంధించిన ప్రతి ప్రచార చిత్రం .. పోస్టర్ అభిమానుల్లోకి దూసుకెళ్లాయి. 2020 సంక్రాంతి తర్వాత ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు కోన బృందం ప్లాన్ చేస్తోంది.
ఈనెల 17న క్రేజీ సింగర్ సిద్ శ్రీరామ్ ఆలపించిన పాట ప్రోమోని రిలీజ్ చేయనున్నారు. భాస్కర భట్ల ఈ లిరిక్ ని రాశారు. ఆ మేరకు అధికారిక పోస్టర్ ద్వారా వివరాల్ని అందించింది చిత్రబృందం. ఇటీవల టాలీవుడ్ లో పలు చార్ట్ బస్టర్ సాంగ్స్ ని ఆలపించిన సిధ్ శ్రీరామ్ నిశ్శబ్ధం కోసం నిన్నే నిన్నే అంటూ సాగే పాటను ఆలపించారు. కొత్త సంవత్సరం మొదలు నిశ్శబ్ధం ప్రమోషన్ ని కోన టీమ్ మరింత వేడెక్కించనుంది. అప్పుడు స్వీటీ స్వయంగానే బరిలోకి దిగనున్న సంగతి తెలిసిందే.