Begin typing your search above and press return to search.
`నేను స్టూడెంట్ ని సర్` టైటిల్ ఐడియా ఎవరిదో తెలుసా?
By: Tupaki Desk | 28 May 2023 10:46 AM GMT`స్వాతిముత్యం` ఫేం బెల్లంకొండ గణేష్ కథానాయకుడిగా `నేను స్టూడెఓంట్ ని సర్` అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో దర్శకుడు తేజ శిష్యుడు రాకేష్ అనే కొత్త కుర్రాడు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సాధారణంగా ఏ సినిమాకైనా దర్శకుడి మాటే నెగ్గుతుంది. హీరో ఏం చెప్పినా? నిర్మాత ఏం చెప్పినా? చివరిగా కెప్టెన్ ఆఫ్ ది షిప్ దే తుది నిర్ణయం అవుతుంది. ఎవరైనా సరే అతని ఆదేశాలు పాటించి ముందుకెళ్లాలి.
అయితే టైటిల్ విషయంలో మాత్రం నిర్మాత..దర్శకుడితో ఏకీభవించినట్లు కనిపించలేదు. దర్శకుడు ఓ టైటిల్ చెబితే నిర్మాత మరో టైటిట్ కి మెగ్గు చూపి...తన అనుకున్నదే టైటిల్ అవ్వాలని పట్టు బట్టి ఈ టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. తొలుత చిత్రానికి `చరవాణీ`.. `రింగ్ `అనే టైటిల్స్ ని దర్శకుడు అనుకు న్నారుట. కానీ నిర్మాత సతీష్ సినిమాలో డైలాగ్ నే టైటిల్ గా పేడితే బాగుంటుందని సూచించడంతో! అతన్ని కాదనలేక దర్శకుడు పెట్టినట్లు తెలుస్తోంది.
టైటిల్ సినిమాకి పక్కాగా యాప్ట్ అయిందని దర్శకుడు అంటున్నాడు. అలాగే సినిమాలో కమీషనర్ పాత్రని గౌతమ్ మీనన్ తో చేయించాల నుకున్నారుట. కానీ నిర్మాత సముద్రఖని పేరు సూచించారుట. అలా అక్కడా దర్శకుడు మాట నెగ్గలేదని తెలుస్తోంది. ఆ తర్వాత సముద్రఖని అయితే పర్పెక్ట్ గా యాప్ట్ అవుతున్నారని దర్శకుడు భావించారుట.
దర్శకుడిది భీమడొలు అట. అయితే వ్యాపార నిమిత్తం కుటుంబం దర్శకుడు సుకుమార్ ఊరు పక్కన తాటిపాకకు వలస వెళ్లారుట. ఆ తర్వాత చదువు పూర్యయ్యే సరికి గుర్తింపు కోసం పోరాటం మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. అప్పుడే అతనిలో దర్శకుడి ఆలోచన మొదలైందిట. అలా టాలీవుడ్ లో ప్రవేశించినట్లు తెలుస్తుంది. ఆ త ర్వాత తేజ దగ్గర నీకు నాకు డ్యాష్ డ్యాష్ నుంచి అహింస వరకూ కథ పనుల్లో భాగమైనట్లు తెలిపారు. తదుపరి సినిమా కూడా సతీష్ తోనే చేస్తున్నట్లు రివీల్ చేసాడు.
అయితే టైటిల్ విషయంలో మాత్రం నిర్మాత..దర్శకుడితో ఏకీభవించినట్లు కనిపించలేదు. దర్శకుడు ఓ టైటిల్ చెబితే నిర్మాత మరో టైటిట్ కి మెగ్గు చూపి...తన అనుకున్నదే టైటిల్ అవ్వాలని పట్టు బట్టి ఈ టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. తొలుత చిత్రానికి `చరవాణీ`.. `రింగ్ `అనే టైటిల్స్ ని దర్శకుడు అనుకు న్నారుట. కానీ నిర్మాత సతీష్ సినిమాలో డైలాగ్ నే టైటిల్ గా పేడితే బాగుంటుందని సూచించడంతో! అతన్ని కాదనలేక దర్శకుడు పెట్టినట్లు తెలుస్తోంది.
టైటిల్ సినిమాకి పక్కాగా యాప్ట్ అయిందని దర్శకుడు అంటున్నాడు. అలాగే సినిమాలో కమీషనర్ పాత్రని గౌతమ్ మీనన్ తో చేయించాల నుకున్నారుట. కానీ నిర్మాత సముద్రఖని పేరు సూచించారుట. అలా అక్కడా దర్శకుడు మాట నెగ్గలేదని తెలుస్తోంది. ఆ తర్వాత సముద్రఖని అయితే పర్పెక్ట్ గా యాప్ట్ అవుతున్నారని దర్శకుడు భావించారుట.
దర్శకుడిది భీమడొలు అట. అయితే వ్యాపార నిమిత్తం కుటుంబం దర్శకుడు సుకుమార్ ఊరు పక్కన తాటిపాకకు వలస వెళ్లారుట. ఆ తర్వాత చదువు పూర్యయ్యే సరికి గుర్తింపు కోసం పోరాటం మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. అప్పుడే అతనిలో దర్శకుడి ఆలోచన మొదలైందిట. అలా టాలీవుడ్ లో ప్రవేశించినట్లు తెలుస్తుంది. ఆ త ర్వాత తేజ దగ్గర నీకు నాకు డ్యాష్ డ్యాష్ నుంచి అహింస వరకూ కథ పనుల్లో భాగమైనట్లు తెలిపారు. తదుపరి సినిమా కూడా సతీష్ తోనే చేస్తున్నట్లు రివీల్ చేసాడు.