Begin typing your search above and press return to search.

చైతూ అఖిల్ అలాంటివి చేస్తే నేను ఒప్పుకోను నాగార్జున

By:  Tupaki Desk   |   27 Oct 2021 11:30 PM GMT
చైతూ అఖిల్ అలాంటివి చేస్తే నేను ఒప్పుకోను  నాగార్జున
X
నాగార్జున సూపర్‌ హిట్ మూవీ 'నిన్నే పెళ్లాడతా' సినిమా విడుదల అయ్యి 25 ఏళ్లు పూర్తి అయ్యింది. ఇప్పటికి కూడా ఆ సినిమాలోని పాటలన్నీ కూడా జనాల్లో మంచి ఆధరణను దక్కించుకుంటూనే ఉన్నాయి. సినిమా టీవీలో వచ్చిన ప్రతి సారి కూడా జనాలు టీవీలకు అతుక్కు పోతూనే ఉన్నారు. ఇన్నేళ్లు అయినా కూడా సినిమా చాలా కొత్తగానే అనిపిస్తుంది అంటూ నాగార్జున ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. నాగార్జున ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ఆ సినిమాలో ఎక్కువ బైక్ రైడింగ్‌ సన్నివేశాలు ఉన్నాయి. ఆ సన్నివేశాల్లో గంటలకు 80 నుండి 90 కిలో మీటర్ల వేగంతో రైడింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆలోచిస్తే నాకే షాకింగ్ గా ఉంది.

ఎలాంటి డూప్ లేకుండా నేనే స్వయంగా అంత వేగంతో డ్రైవ్‌ చేయడం అంటే నాకే ఆశ్చర్యంగా ఉందని నాగార్జున అన్నాడు. ఒక వేళ ఇప్పుడు అడిగితే మాత్రం ఆ సాహసం నేను చేయను. అఖిల్ మరియు చైతూలు చేస్తానన్నా కూడా నేను ఒప్పుకోను. ఇద్దరికి కూడా అంతటి రిస్కీ సన్నివేశాలను చేయవద్దనే సలహా ఇస్తానంటూ నాగార్జున చెప్పుకొచ్చాడు. నిన్నే పెళ్లాడతా సినిమా లోని ప్రతి సన్నివేశం కూడా తనకు ఇంకా చాలా బాగా గుర్తుందని.. షూటింగ్‌ సమయంలో చాలా సరదాగా గడిచి పోయిందంటూ నాగ్‌ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా లో టబు హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే.

ప్రస్తుతం నాగార్జున ఘోస్ట్‌ మరియు బంగార్రాజు సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్దకు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. బంగార్రాజు సినిమా సోగ్గాడే చిన్ని నాయనకు కొనసాగింపు అనే వార్తలు వస్తున్నాయి. బంగార్రాజులో నాగ చైతన్య కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే. చైతూకు జోడీగా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా రమ్యకృష్ణ బంగార్రాజులో నాగార్జునకు జోడీగా నటిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. మొత్తానికి నాగ్‌ రెండు సినిమాలు కూడా మంచి బజ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాయి.