Begin typing your search above and press return to search.

చైతూ ‘నాగేశ్వరరావు’ కథ కంచికేనా?

By:  Tupaki Desk   |   24 Feb 2020 4:10 AM GMT
చైతూ ‘నాగేశ్వరరావు’ కథ కంచికేనా?
X
‘గీత గోవిందం’ చిత్రం తర్వాత దర్శకుడు పరుశురామ్‌ చేయబోతున్న సినిమా అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. మహేష్‌ బాబు నుండి మొదలుకుని ఎన్నో పేర్లు వచ్చాయి. చివరకు నాగచైతన్యతో ‘నాగేశ్వరరావు’ అనే చిత్రాన్ని చేయబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. రష్మిక హీరోయిన్‌ అంటూ కూడా వార్తలు వచ్చాయి. ప్రస్తుతం చైతూ చేస్తున్న లవ్‌ స్టోరీ పూర్తి అయిన వెంటనే అంటే సమ్మర్‌ లో నాగేశ్వరరావును ప్రారంభించే అవకాశం ఉందనుకున్నారు. కాని అనూహ్యంగా నాగేశ్వరావు పక్కకు పెట్టేసినట్లే అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

మహేష్‌ బాబు 27వ చిత్రంను పరుశురామ్‌ దర్శకత్వంలో చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాగచైతన్యతో పరశురామ్‌ సినిమా ఉంటుందా లేదా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మహేష్‌ బాబుతో సినిమా ఛాన్స్‌ వచ్చిన నేపథ్యంలో నాగేశ్వరరావు సినిమాను దర్శకుడు పరుశురామ్‌ పక్కకు పెట్టి ఉంటాడంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

మహేష్‌ బాబు.. పరుశురామ్‌ ల కాంబో మూవీ గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అదే సమయంలో నాగేశ్వరరావు మూవీ పరిస్థితి ఏంటీ అనేది కూడా ఆయన చెప్పాలంటూ అక్కినేని ఫ్యాన్స్‌ డిమాండ్‌ చేస్తున్నారు. గీత గోవిందం చిత్రం తర్వాత పరుశురామ్‌ దాదాపు రెండు సంవత్సరాలు గ్యాప్‌ తీసుకుని ఇప్పుడు రెండు సినిమాలు అంటూ ప్రేక్షకులను కన్ఫ్యూజ్‌ చేస్తున్నాడు.

--