Begin typing your search above and press return to search.

ప్రభాస్‌ తో కంటే ముందే రెండు ప్రాజెక్ట్‌ లతో నాగ్‌ అశ్విన్‌

By:  Tupaki Desk   |   25 Sep 2020 6:15 AM GMT
ప్రభాస్‌ తో కంటే ముందే  రెండు ప్రాజెక్ట్‌ లతో నాగ్‌ అశ్విన్‌
X
చేసినవి రెండే సినిమాలు అయినా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ కు దక్కిన స్టార్‌ డం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మహానటి సినిమాతో ఆయన జాతీయ స్థాయి సినిమాను తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు కమర్షియల్‌ గా బిగ్గెస్ట్‌ సక్సెస్‌ ను దక్కించుకున్నాడు. మహానటి తర్వాత ప్రభాస్‌ తో ఒక భారీ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీని రూపొందించబోతున్నట్లుగా నాగ్‌ అశ్విన్‌ నుండి ప్రకటన వచ్చింది. ఇప్రటికే స్క్రిప్ట్ వర్క్‌ పూర్తి చేసిన దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ప్రభాస్‌ ఇతర ప్రాజెక్ట్‌ ల కారణంగా వచ్చే ఏడాది వరకు వెయిట్‌ చేయాల్సి వచ్చింది. ఈ గ్యాప్‌ ను ఫిల్‌ చేసేందుకు నాగ్‌ అశ్విన్‌ రెండు ప్రాజెక్ట్‌ల ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు.

హిందీలో సూపర్‌ హిట్‌ అయిన లస్ట్‌ స్టోరీస్‌ వెబ్‌ సిరీస్‌ ను తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. నాలుగు ఎపిసోడ్‌ లకు నలుగురు దర్శకులు దర్శకత్వం వహిస్తున్నారు. అందులో ఒక ఎపిసోడ్‌ కు నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే తెలుగు లస్ట్‌ స్టోరీస్‌ స్ట్రీమింగ్‌ కాబోతుంది. నెట్‌ ఫ్లిక్స్‌ కోసం మరో ప్రాజెక్ట్‌ ను నాగ్‌ అశ్విన్‌ చేసేందుకు సిద్దం అయ్యాడు. 30 నిమిషాల నిడివి ఉండే ఒక వెబ్‌ మూవీని శృతి హాసన్‌ తో రూపొందించబోతున్నాడు. ఇందుకోసం సారధి స్టూడియోలో సెట్‌ కూడా నిర్మిస్తున్నారు. వచ్చే నెల నుండి షూటింగ్‌ జరుపబోతున్నారు.

ఈ రెండు కూడా ప్రభాస్‌ తో సినిమాను మొదలు పెట్టక ముందే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ రెండు కాకుండా ఇంకా కూడా నాగ్‌ అశ్విన్‌ వెబ్‌ సిరీస్‌ లేదా వెబ్‌ మూవీలు చేస్తాడా అనేది చూడాలి. వచ్చ ఏడాది సమ్మర్‌ లో ప్రభాస్‌ తో నాగ్‌ అశ్విన్‌ మూవీ పట్టాలెక్కే అవకాశం ఉందని అంటున్నారు. కాస్త ఆలస్యం అయినా సినిమా విడుదల మాత్రం ఖచ్చితంగా 2022లో ఉంటుందని మేకర్స్‌ చెబుతున్నారు. ప్రస్తుతం రాధేశ్యామ్‌ సినిమాను చేస్తున్న ప్రభాస్‌ ఆ తర్వాత ఆదిపురుష్‌ సినిమాను చేస్తున్నాడు.