Begin typing your search above and press return to search.

NTR-30 పోస్ట‌ర్ తో సైర‌న్ మోగించారుగా

By:  Tupaki Desk   |   19 Feb 2020 12:00 PM GMT
NTR-30 పోస్ట‌ర్ తో సైర‌న్ మోగించారుగా
X
గ‌త కొంత‌కాలంగా యంగ్ య‌మ ఎన్టీఆర్ న‌టించే ల్యాండ్ మార్క్ (30వ) మూవీ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. మాయావి త్రివిక్ర‌మ్ వ‌ల్ల అన్న‌ద‌మ్ముల మ‌ధ్య క‌ల‌త‌లు మొద‌ల‌య్యాయి అంటూ కొంద‌రు అడ్వాన్స్ డ్ గానే ప్ర‌చారం చేశారు. ఎన్టీఆర్ 30వ సినిమాని క‌ల్యాణ్ రామ్ నిర్మించాల్సి ఉండ‌గా.. మ‌ధ్య‌లో హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ త‌ల‌దూర్చింద‌ని.. అందుకు త్రివిక్ర‌మ్ కార‌కుడు అని ప్ర‌చార‌మైంది.

అయితే అన్ని పుకార్ల‌కు చెక్ పెట్టేస్తూ తాజాగా ఎన్టీఆర్ 30 పోస్ట‌ర్ రిలీజైంది. తార‌క్ తో త్రివిక్ర‌మ్ ప్రాజెక్ట్ అధికారికంగా క‌న్ఫామ్ చేశారు. ఇక ఈ పోస్ట‌ర్ లో నిర్మాత‌లుగా ఎస్.రాధాకృష్ణ‌(చిన‌బాబు)- నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ పేర్ల‌ను ప్ర‌క‌టించారు. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ తో క‌లిసి నంద‌మూరి తార‌క‌రామారావు ఆర్ట్స్ బ్యాన‌ర్ తార‌క్ 30వ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అంటే ఆ ఇద్ద‌రినీ క‌లిపేందుకు ఎన్టీఆర్ చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించాయ‌నే దీన‌ర్థం. ఈ చిత్రాన్ని 2021 స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేయ‌నున్నారు.

`అయిన‌ను పోయి రావ‌లె హ‌స్తిన‌కు` అనే టైటిల్ ని ఖ‌రారు చేసార‌ని ప్ర‌చార‌మైనా.. టైటిల్ ని మాత్రం అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. ఇక ఈ క్రేజీ మూవీలోనూ క‌థానాయిక‌గా పూజా హెగ్డేని త్రివిక్ర‌మ్ లాక్ చేశార‌ని .. ర‌ష్మిక కూడా ఓ క‌థానాయిక‌గా న‌టించ‌నుంద‌ని ఇంత‌కుముందు ప్ర‌చార‌మైంది. అయితే క‌థానాయిక‌ల‌కు సంబంధించి అధికారికంగా ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. ఇత‌ర కాస్టింగ్ క్రూ వివ‌రాలు వెల్ల‌డించాల్సి ఉంటుంది.