Begin typing your search above and press return to search.

టాలీవుడ్ డ్రగ్స్ కేసు: ముమైత్ ఖాన్ పై 7 గంటల పాటు ఈడీ ప్రశ్నల వర్షం..!

By:  Tupaki Desk   |   15 Sep 2021 2:30 PM GMT
టాలీవుడ్ డ్రగ్స్ కేసు: ముమైత్ ఖాన్ పై 7 గంటల పాటు ఈడీ ప్రశ్నల వర్షం..!
X
నాలుగేళ్ళ క్రితం నాటి టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణను వేగవంతం చేసింది. మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్న ఈడీ.. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసి విచారించింది. ఈ క్రమంలో నేడు బుధవారం నటి ముమైత్ ఖాన్ ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఉదయం ప్రారంభమైన విచారణలో దాదాపు 7 గంటల పాటు అధికారులు ముమైత్ ను ప్రశ్నించారు.

మనీ లాండరింగ్ కోణంలో ముమైత్ ఖాన్ బ్యాంకు ఖాతాల వివరాలను పరిశీలించిన ఈడీ అధికారులు.. అనుమానాస్పద లావాదేవీల గురించి ఆరా తీసినట్లు తెలుస్తోంది. డ్రగ్ సప్లయిర్ కెల్విన్ తో ఉన్న సంబంధాల గురించి అధికారులు ఆమెను ప్రశ్నించారు. ఎఫ్ క్లబ్ లో జరిగే పార్టీలు - క్లబ్ జీఎంకి ముమైత్ కు మధ్య జరిగి బ్యాంకు ట్రాన్సాక్షన్స్ తదితర అంశాలపై ముమైత్ ను ఈడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఎప్పుడు పిలిచినా మళ్ళీ విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని అధికారులు ఆమెను ఆదేశించారు.

2017లో ఎక్సైజ్ శాఖ సిట్ నివేదిక ఆధారంగా ఈడీ ముమైత్ ఖాన్ ను విచారించింది. అప్పట్లో ఆమెను సుమారు పది గంటల పాటు విచారించగా.. ఇప్పుడు ఈడీ అధికారులు దాదాపు 7 గంటల పాటు ముమైత్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడైన కెల్విన్ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నాడు. గతంలో ఎక్సైజ్ శాఖ విచారించిన పూరీ జగన్నాథ్ - ఛార్మి - రవితేజ - నవదీప్ - నందు లతో పాటు రకుల్‌ ప్రీత్ సింగ్ - దగ్గుబాటి రానాలను కూడా ఈడీ ప్రశ్నించింది. రాబోయే రోజుల్లో తరుణ్ - తనీష్ లను అధికారులు విచారించనున్నారు.