Begin typing your search above and press return to search.
మళ్లీ టెన్షన్ లో బడా బ్యానర్లు..?
By: Tupaki Desk | 16 April 2021 3:35 PM GMTకరోనా మహమ్మారి కారణంగా గతేడాది సినీ ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోయింది. లాక్ డౌన్ పెట్టడంతో సినిమా షూటింగ్స్ లేక.. షూటింగులు పూర్తైన సినిమాలు రిలీజ్ అవ్వక ప్రొడ్యూసర్స్ చాలా నష్టపోయారు. ముఖ్యంగా ఫైనాన్స్ తెచ్చి సినిమాలను నిర్మించిన నిర్మాతలు దిక్కు తోచని స్థితిలో పడిపోయారు. అయితే లాక్ డౌన్ ఎత్తేయడంతో సినిమా షూటింగ్స్ తిరిగి స్టార్ట్ అవడం.. థియేటర్లు మళ్లీ ఓపెన్ అవ్వడం.. సినిమాలు రిలీజ్ అవడం మొదలయ్యాయి. దీంతో కొన్ని నెలల పాటు నష్టాలు చవి చూసిన తెలుగు సినీ పరిశ్రమ మెల్లిగా మళ్లీ పుంజుకోవడం షూరు అయింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లోని పెద్ద బ్యానర్లు అన్నీ వరుసగా సినిమాలు కమిటైయ్యాయి.
మైత్రీ మూవీ మేకర్స్ వారు ఇప్పటికే 9 క్రేజీ ప్రాజెక్ట్స్ ప్రకటించారు. చిరంజీవి - మహేష్ బాబు - బాలకృష్ణ - పవన్ కళ్యాణ్ - అల్లు అర్జున్ - నాని - విజయ్ దేవరకొండ వంటి హీరోలతో సినిమాలు కమిటైయ్యారు. అలానే గీతా ఆర్ట్స్ మరియు అనుబంధ సంస్థ జీఏ2 బ్యానర్స్ లో 6 సినిమాలు నిర్మాణంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక యూవీ క్రియేషన్స్ లో అర డజనుకు పైగా సినిమాల వర్క్స్ జరుగుతున్నాయని సమాచారం. హారిక అండ్ హాసిని మరియు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో 4 సినిమాల నిర్మాణం జరుగుతోంది. దిల్ రాజు కాంపౌండ్ లో 5 సినిమాల పనులు జరుగుతున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద బ్యానర్స్ అన్నీ కొత్త సినిమాలు తెరకెక్కించే పనిలో ఫుల్ బిజీ అయిపోయారు. అయితే ఇప్పుడు కరోనా కారణంగా మళ్ళీ టెన్షన్ పడుతున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
కరోనా సెకండ్ వేవ్ మళ్లీ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకు కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో మళ్ళీ థియేటర్ల సమస్య.. ఫైనాన్స్ కష్టాలు.. ఇలా పెద్ద రేంజ్ లో బడా బ్యానర్లకి కష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలు వాయిదా పడ్డాయి. దీనికి తోడు అడ్వాన్స్ తీసుకున్న చాలా మంది టాలీవుడ్ టెక్నీషయన్లకి కోవిడ్ సోకడంతో ల్యాబ్ రెంట్స్ అన్నీ కలిసి ఖర్చులు డబుల్ అవుతున్నాయని సమాచారం. మరి రాబోయే రోజుల్లో ఇండస్ట్రీలో పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి.
మైత్రీ మూవీ మేకర్స్ వారు ఇప్పటికే 9 క్రేజీ ప్రాజెక్ట్స్ ప్రకటించారు. చిరంజీవి - మహేష్ బాబు - బాలకృష్ణ - పవన్ కళ్యాణ్ - అల్లు అర్జున్ - నాని - విజయ్ దేవరకొండ వంటి హీరోలతో సినిమాలు కమిటైయ్యారు. అలానే గీతా ఆర్ట్స్ మరియు అనుబంధ సంస్థ జీఏ2 బ్యానర్స్ లో 6 సినిమాలు నిర్మాణంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక యూవీ క్రియేషన్స్ లో అర డజనుకు పైగా సినిమాల వర్క్స్ జరుగుతున్నాయని సమాచారం. హారిక అండ్ హాసిని మరియు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో 4 సినిమాల నిర్మాణం జరుగుతోంది. దిల్ రాజు కాంపౌండ్ లో 5 సినిమాల పనులు జరుగుతున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద బ్యానర్స్ అన్నీ కొత్త సినిమాలు తెరకెక్కించే పనిలో ఫుల్ బిజీ అయిపోయారు. అయితే ఇప్పుడు కరోనా కారణంగా మళ్ళీ టెన్షన్ పడుతున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
కరోనా సెకండ్ వేవ్ మళ్లీ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకు కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో మళ్ళీ థియేటర్ల సమస్య.. ఫైనాన్స్ కష్టాలు.. ఇలా పెద్ద రేంజ్ లో బడా బ్యానర్లకి కష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలు వాయిదా పడ్డాయి. దీనికి తోడు అడ్వాన్స్ తీసుకున్న చాలా మంది టాలీవుడ్ టెక్నీషయన్లకి కోవిడ్ సోకడంతో ల్యాబ్ రెంట్స్ అన్నీ కలిసి ఖర్చులు డబుల్ అవుతున్నాయని సమాచారం. మరి రాబోయే రోజుల్లో ఇండస్ట్రీలో పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి.