Begin typing your search above and press return to search.

తారకరత్న మరణించి నెలరోజులు.. భార్య అలేఖ్యరెడ్డి పోస్ట్ వైరల్

By:  Tupaki Desk   |   19 March 2023 10:03 AM GMT
తారకరత్న మరణించి నెలరోజులు.. భార్య అలేఖ్యరెడ్డి పోస్ట్ వైరల్
X
తారకరత్న భౌతికంగా మన మధ్య లేడు. కానీ ఆయన మిగిల్చిన విషాదం మాత్రం ఆయన కుటుంబాన్ని వెంటాడుతూనే ఉంది. జ్ఞాపకాలు ఇప్పటికీ పదిలంగానే పంచుకుంటున్నారు. తారకరత్న మరణించి నెలరోజులు అయిన సందర్భంగా ఆయన భార్య అలేఖ్య రెడ్డి తాజాగా జ్ఞాపకాలు పంచుకున్నారు. భర్తతో అనుబంధాన్ని.. తాము అనుభవించిన బాధలను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు. ఆమె పంచుకున్న ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో తాము జీవితంలో పెళ్లి చేసుకోవడానికి, బతకడానికి ఎంత కష్టపడ్డామన్నది వివరించారు. అది ఇప్పుడు వైరల్ అవుతోంది.

సరిగ్గా నెల రోజుల క్రితం, అంటే ఫిబ్రవరి 18న మరణించిన దివంగత నటుడు నందమూరి తారకరత్నను ఈ సందర్భంగా ఆయన సతీమణి అలేఖ్యారెడ్డి స్మరించుకున్నారు. అతని ఆకస్మిక మరణంతో దుఃఖంలో ఉన్న భార్య , అతని ముగ్గురు పిల్లల బాధను ఇన్ స్టాగ్రామ్ లో వ్యక్తం చేశారు. అలేఖ్య తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా తన భావాలను వ్యక్తం చేస్తున్నారు. 'యువగళం' పాదయాత్రలో తారకరత్న కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యాడు. చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. 28 రోజుల పాటు పోరాడి తుది శ్వాస విడిచారు.

అలేఖ్య తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో చాలా అంతర్గత కుటుంబ విషయాలు.. విద్వేషాలను పంచుకుంది. "మీరు మమ్మల్ని విడిచిపెట్టి సరిగ్గా ఒక నెల అయ్యింది, కానీ మీ జ్ఞాపకాలు నా మదిలో చాలా తాజాగా ఉన్నాయి.. మేము కలుసుకున్నాము, మంచి స్నేహితులం అయ్యాము, డేటింగ్ ప్రారంభించాము, అయినప్పటికీ మా సంబంధం గురించి ఎవరికీ తెలియదు, మా జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించగలమని చాలా నమ్మకంగా చెప్పారు. ఆ నిర్ణయం నుండే మీరు యుద్ధాలు చేశారు.. అనంతరం ఎవరికీ ఇష్టం లేకున్నా పెళ్లి చేసుకున్నాము, గందరగోళంగా మారింది., మేము వివక్షకు గురయ్యాము, కానీ మేము ఇంకా జీవించి సంతోషంగా ఉన్నాము. ఈ రోజు వరకు నువ్వు -నేను మాత్రమే.. నిష్కమ్మ పుట్టిన తర్వాత జీవితం మారిపోయింది, మా సంతోషం రెట్టింపు అయ్యింది, కానీ బాధలు మాత్రం అలాగే ఉన్నాయి.. మేము ప్రతి రోజు ఒక్కోసారి ఎంత బాధపడ్డామో ఎవరికీ తెలియదు.

ద్వేషానికి కళ్ళు మూసుకుని, మౌనంగా రోదించాము. 2019లో మాకు ఆనందం కలిగింది..కవలలు జన్మించారు. నాకు ఇంకా గుర్తుంది మీరు ఎప్పుడూ పెద్ద కుటుంబాన్ని కోరుకున్నారు. మీ కుటుంబాన్ని కోల్పోయారని, అందుకే మాకు అందమైన కుటుంబాన్ని అందించారు. ఇన్నేళ్లూ, ఆ పోరాటం చివరి వరకు సాగింది. అయితే ఎవరికీ అర్థం కాలేదు. మీరు మీ హృదయంలో మోసుకెళ్ళే బాధను చూడలేదు. ఎందుకంటే కొన్నిసార్లు మేము మా బాధతో బాధపడినప్పుడు అది తీర్చింది మీరే.. మీరు ఎదుర్కొన్న కష్టాల నుండి నేను మీకు సహాయం చేయలేకపోయాను.. మొదటి నుండి మాకు అండగా నిలిచిన వ్యక్తులు మాత్రమే చివరి వరకు ఉన్నారు, కానీ మేము కోల్పోయిన వారు చాలా కాలం పోయారు. మీ సమాధిపై కూడా మిమ్మల్ని కనుగొనలేకపోయారు. .నువ్వే మా నిజమైన హీరో ఓబు అంటూ ఇన్ స్టాగ్రామ్ లో అలేఖ్యరెడ్డి చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

ఈ తక్కువ వ్యవధిలో కూడా నీతో ఈ ప్రయాణం సాగిస్తున్నందుకు కుటుంబసభ్యులుగా మేము గర్విస్తున్నాం అంటూ బాలయ్య, విజయసాయిరెడ్డిని ట్యాగ్ చేస్తూ అలేఖ్యరెడ్డి ముగించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.