Begin typing your search above and press return to search.

'సెల్ఫీ పిక్'తో వైరల్ అవుతున్న మెగాబ్రదర్ ఫ్యామిలీ!

By:  Tupaki Desk   |   23 Jan 2021 10:08 AM GMT
సెల్ఫీ పిక్తో వైరల్ అవుతున్న మెగాబ్రదర్ ఫ్యామిలీ!
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ ఫ్యామిలీకి ఓ ప్రత్యేక గుర్తింపు ఉన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే అందులో మెగాబ్రదర్ నాగబాబు ఫ్యామిలీ అంటే గుర్తొచ్చేది మాత్రం వరుణ్ తేజ్, నిహారిక. వీరిద్దరూ ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుణ్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇక నిహారిక ఇటీవల పెళ్లి చేసుకొని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. కానీ భర్తతో మాల్దీవ్స్ టూర్ వెళ్లి రాగానే ఓ వెబ్ సిరీస్ షూటింగ్ లో పాల్గొంటుంది. నాగబాబు గురించి చెప్పక్కర్లేదు. ఆయన ఏదో విధంగా నిత్యం వార్తలలో నిలుస్తూనే ఉంటారు. అయితే కూతురు పెళ్లి తర్వాత నాగబాబు కాస్త కాంట్రవర్సీలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తుంది. అందుకే ఈ మధ్య ఎక్కడా వార్తలలో కనిపించడం లేదు. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ మెగాబ్రదర్ ఫ్యామిలీ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఫోటో చూస్తుంటే పెళ్లి తర్వాత ఫస్ట్ టైం నిహారిక పుట్టింటికి వచ్చినట్లుగా కనిపిస్తుంది. ఇంస్టాగ్రామ్ వేదికగా వరుణ్ పోస్ట్ చేసిన సెల్ఫీ ఫోటోలో ఫ్యామిలీ అంతా ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు చూస్తే అర్ధమవుతుంది. ఇక వరుణ్ స్వయంగా సెల్ఫీ తీస్తూ తన తల్లిని హత్తుకుని ఉన్నాడు. అలాగే పక్కన నాగబాబు బ్లూ టిషర్ట్, హెడ్ క్లాత్ ఒకటి ధరించి స్మైల్ ఇస్తున్నాడు. ఇక సోఫాలో చివరిగా కూర్చుంది నిహారిక. చూస్తుంటే పడిపడి నవ్వుతుంది. మరి ఫ్యామిలీ మొత్తం ఒకచోట చేరి సంతోషంగా ముచ్చట్లు పెట్టుకుంటున్నట్లున్నారు. ప్రస్తుతం ఈ మెగా ఫ్యామిలీ పిక్ నెట్టింట ఫుల్ చక్కర్లు కొట్టేస్తోంది. హ్యాపీ ఫ్యామిలీ అంటూ చూస్తున్న నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం నాగబాబు అదిరింది అనే కామెడి షోలో జడ్జిగా వ్యవహారిస్తున్నారు. ఇక వరుణ్ ఎఫ్3, గని సినిమాలతో బిజీగా ఉన్నాడు.