Begin typing your search above and press return to search.

షూటింగుకి సిద్దమైన మణిరత్నం భారీ ఫిల్మ్!

By:  Tupaki Desk   |   30 May 2020 11:30 PM GMT
షూటింగుకి సిద్దమైన మణిరత్నం భారీ ఫిల్మ్!
X
ఇండియన్ క్లాసిక్ డైరెక్టర్ మణిరత్నం సినిమాలంటే సినీ అభిమానులకు బంగారం దొరికినట్లే. ఆయన మేకింగ్‌ను ఇష్టపడని వారుండరు. గత కొన్నేళ్లుగా మణిరత్నంకు సరైన సక్సెస్ రాలేదు. చివరగా నవాబ్ చిత్రంతో ఓ మోస్తరు విజయం వరించినా తదుపరి చిత్రాన్ని మాత్రం భారీ ఎత్తున ప్లాన్ చేశాడు. ఒక ఫేమస్ నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చాలామంది స్టార్లు నటిస్తున్నారు. భారత వెండితెర పై అగ్ర స్థాయి కథానాయిక ఇమేజ్‌ దక్కించుకున్న అందాల భామ ఐశ్వర్యరాయ్‌. బాలీవుడ్‌ లో టాప్ హీరోయిన్గా ఎదిగిన ఈమె అడపాదడపా సౌత్ సినిమాల్లోనూ కనిపించింది. ప్రస్తుతం ఐశ్వర్య తనను హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం చేసిన మణిరత్నం 'పొన్నియన్‌ సెల్వన్‌' సినిమాలో నటిస్తోంది. ఆయన దర్శకత్వం వహించిన 'ఇద్దరు' సినిమాతో హీరోయిన్‌గా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది ఐష్‌.

చివరిగా తెలుగులో సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన రోబో సినిమాలో కనిపించింది. పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, విక్రమ్ ప్రభు, ఐశ్వర్యా లక్ష్మీ, ఐశ్వర్యా రాయ్, శోభితా ధూళిపాల, అదితి రావ్ హైదరీ, అశ్విన్, జయరామ్ వంటి భారీ తారాగణం నటిస్తుంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ జులై నెల చివరి నుండి ప్రారంభం చేయనున్నట్లు సమాచారం. లాక్ డౌన్ అనంతరం పాండిచ్చేరిలో ఓ భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారట చిత్రయూనిట్. ఈ భారీ షెడ్యూల్లో హీరో విక్రమ్.. ఐశ్వర్య రాయ్.. కార్తీలు పాల్గొంటున్నట్లు తెలుస్తుంది. పొన్నియన్ సెల్వన్ పార్ట్-1, పార్ట్ - 2 లుగా విడుదల కానుందట.