Begin typing your search above and press return to search.

వీడియో ట్రోల్స్‌ : సామ్‌ లో కనిమించిన ఎమోషన్ జెన్నీలో మిస్‌

By:  Tupaki Desk   |   7 Dec 2022 5:22 AM GMT
వీడియో ట్రోల్స్‌ : సామ్‌ లో కనిమించిన ఎమోషన్ జెన్నీలో మిస్‌
X
నాగచైతన్య మరియు సమంత జంటగా నటించిన చిత్రం 'మజిలీ'. ఆ సినిమాను ఇప్పుడు మరాఠీలో రీమేక్ చేశారు. వేడ్‌ అనే టైటిల్‌ తో రూపొందిన రీమేక్ లో రితేష్ దేశ్‌ ముఖ్‌ మరియు జెనీలియా జంటగా కనిపించబోతున్నారు. ఒరిజినల్‌ మజిలీ సినిమాలో నిజంగా భార్య భర్తలు నటించగా రీమేక్‌ లోనూ అదే రిపీట్ అవ్వబోతుంది.

విడాకులు తీసుకోక ముందు నాగచైతన్య మరియు సమంత నటించిన చివరి సినిమా మజిలీ. ఆ సినిమా తర్వాత ఇద్దరి కాంబోలో సినిమా మళ్లీ మళ్లీ రావాలని.. కావాలని అభిమానులు కోరుకున్నారు. మజిలీ సినిమాలో సమంత నటనకు ఎన్ని మార్కులు వేసినా తక్కువే. భర్త యొక్క ప్రేమను పొందేందుకు ఆమె చేసే ప్రయత్నం.. ఆమె ఎమోషన్స్ లో చూడవచ్చు.

మజిలీ ని రీమేక్ చేయాలి అంటే సమంత నటనను మ్యాచ్ చేయాలి. అప్పుడే మజిలీ రీమేక్ కు న్యాయం జరుగుతుంది. జెనీలియా చాలా సీనియర్ హీరోయిన్. నటిగా మంచి మార్కులు దక్కించుకుంది. అయినా కూడా రీమేక్ లో జెనీలియా అనుకున్న స్థాయిలో ఎమోషన్స్ పండించలేక పోయిందని ఒక చిన్న వీడియోను షేర్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తూ ఉంటారు.

సమంత ఒక సన్నివేశంలో నాగ చైతన్య కాలు టచ్ చేస్తుంది. ఆ సన్నివేశంలో సమంతకు అతడిపై ఉన్న ప్రేమ మొత్తం కనిపిస్తుంది. ఆ సన్నివేశంను ఏ ఒక్కరు కూడా ఓవర్‌ అనుకోలేదు. కానీ తాజా ఈ సినిమా లో మాత్రం రితేష్ యొక్క కాలును టచ్ చేసి మొక్కుకున్న సమయంలో జెనీలియా ఓవర్‌ యాక్షన్ అనిపించింది.

ఈ ఒక్క సీన్‌ తోనే మజిలీ రీమేక్ నిరాశ పర్చింది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు మజిలీ సినిమా చూసిన తర్వాత దీన్ని చూడ్డానికి చాలా ఇబ్బంది పడుతున్నట్లుగా అనిపిస్తుంది. సోషల్‌ మీడియాలో ఈ వీడియోను షేర్‌ చేసి జెనీలియాను పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు. మరి సినిమా మరెంత కళా ఖండం అన్నట్లుగా ఉంటుందో అంటూ కామెంట్స్ వస్తున్నాయి.