Begin typing your search above and press return to search.
ఆ గాసిప్ విని మహేష్ ఫ్యాన్స్ కంగారు
By: Tupaki Desk | 24 Feb 2020 6:00 AM GMTసూపర్ స్టార్ మహేష్-శ్రీను వైట్ల కాంబినేషన్ మూవీ `దూకుడు` ఎంతటి బ్లాక్ బస్టర్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. మహేష్ కెరీర్ లోనే ఆ చిత్రం ఓ మైలురాయి. సూపర్ స్టార్ తోనే పూర్తి స్థాయి కామెడీ చేయించారు వైట్ల. ఆ కాన్పిడెన్స్ తోనే వైట్లకు ఆగడు ఆఫర్ ఇచ్చారు. కానీ ఆ సినిమా ఫలితం మహేష్ ని విమర్శల పాలయ్యేలా చేసింది. ఆగడు డిజాస్టర్ రిజల్ట్ తో ఫ్యాన్స్ లో గందరగోళం తలెత్తింది. ఆ తర్వాత మెల్లగా ఏదోలా మహేష్ గాడిలో పడినా.. శ్రీనువైట్ల ఆ ప్లాప్ తో సంబంధం లేకుండా తదుపరి అవకాశాలు అందుకుని ఎలా చేతులు కాల్చుకున్నాడో? కూడా తెలిసిందే.
ప్రస్తుతం శ్రీనువైట్ల కెరీర్ పూర్తిగా డైలమాలో పడింది. చివరిగా రవితేజ హీరోగా తెరకెక్కించిన `అమర్ అక్బర్ ఆంటోనీ` తీవ్ర నిరాశను మిగిల్చింది. దీంతో వైట్లతో సినిమాలు చేయడానికి ఏ హీరో ముందుకు రాని పరిస్థితి ఉంది. ఆయనను నిర్మాతలు నమ్మే అవకాశం లేదిప్పట్లో. అయితే ఇలాంటి సన్నివేశంలో తాజాగా మహేష్- శ్రీనువైట్ల ప్రాజక్ట్ అంటూ ఓ రూమర్ సూపర్ స్టార్ అభిమానుల్లో గందరగోళానికి కారణమైంది. ఇటీవలే మహేష్ కి వైట్ల ఓ లైన్ వినిపించాడని..ఆ లైన్ కు సూపర్ స్టార్ ఇంప్రెస్ అయి బౌండెడ్ స్క్రిప్ట్ తో మళ్లీ కలవమన్నారని ప్రచారమవుతోంది.
అయితే ఈ ప్రచారంలో నిజం ఎంతో తెలియదు గానీ మహేష్ అభిమానులు మాత్రం కంగారు పడుతున్నారు. మళ్లీ ఆయనతో సినిమానా? అంటూ సోషల్ మీడియాల్లో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వినడానికే భయంగా ఉందన్నంత రేంజ్ లో రియాక్ట్ అవుతున్నారు. ఈ రూమర్ నిజం కాకూడదని కొందరు కోరుకుంటున్నారు. అయినా మహేష్ ప్లాప్ ల్లో ఉన్న దర్శకులకు అంత ఈజీగా ఛాన్స్ ఇవ్వరన్న టాక్ ఉంది. మహేష్ కి తొలి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ ఇచ్చిన పూరి జగన్నాథ్ నే వెయిటింగ్ లో పెట్టాడు. అలాంటింది శ్రీనువైట్ల కు ఛాన్స్ ! అంటే ఆలోచించాల్సిందే. ఇప్పటికే మహేష్ క్యూలో వంశీ పైడిపల్లి- పరశురామ్ - త్రివిక్రమ్- అనీల్ రావిపూడి- సురేందర్ రెడ్డి లాంటి టాప్ 5 డైరెక్టర్లు క్యూలో ఉన్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం శ్రీనువైట్ల కెరీర్ పూర్తిగా డైలమాలో పడింది. చివరిగా రవితేజ హీరోగా తెరకెక్కించిన `అమర్ అక్బర్ ఆంటోనీ` తీవ్ర నిరాశను మిగిల్చింది. దీంతో వైట్లతో సినిమాలు చేయడానికి ఏ హీరో ముందుకు రాని పరిస్థితి ఉంది. ఆయనను నిర్మాతలు నమ్మే అవకాశం లేదిప్పట్లో. అయితే ఇలాంటి సన్నివేశంలో తాజాగా మహేష్- శ్రీనువైట్ల ప్రాజక్ట్ అంటూ ఓ రూమర్ సూపర్ స్టార్ అభిమానుల్లో గందరగోళానికి కారణమైంది. ఇటీవలే మహేష్ కి వైట్ల ఓ లైన్ వినిపించాడని..ఆ లైన్ కు సూపర్ స్టార్ ఇంప్రెస్ అయి బౌండెడ్ స్క్రిప్ట్ తో మళ్లీ కలవమన్నారని ప్రచారమవుతోంది.
అయితే ఈ ప్రచారంలో నిజం ఎంతో తెలియదు గానీ మహేష్ అభిమానులు మాత్రం కంగారు పడుతున్నారు. మళ్లీ ఆయనతో సినిమానా? అంటూ సోషల్ మీడియాల్లో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వినడానికే భయంగా ఉందన్నంత రేంజ్ లో రియాక్ట్ అవుతున్నారు. ఈ రూమర్ నిజం కాకూడదని కొందరు కోరుకుంటున్నారు. అయినా మహేష్ ప్లాప్ ల్లో ఉన్న దర్శకులకు అంత ఈజీగా ఛాన్స్ ఇవ్వరన్న టాక్ ఉంది. మహేష్ కి తొలి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ ఇచ్చిన పూరి జగన్నాథ్ నే వెయిటింగ్ లో పెట్టాడు. అలాంటింది శ్రీనువైట్ల కు ఛాన్స్ ! అంటే ఆలోచించాల్సిందే. ఇప్పటికే మహేష్ క్యూలో వంశీ పైడిపల్లి- పరశురామ్ - త్రివిక్రమ్- అనీల్ రావిపూడి- సురేందర్ రెడ్డి లాంటి టాప్ 5 డైరెక్టర్లు క్యూలో ఉన్న సంగతి తెలిసిందే.