Begin typing your search above and press return to search.

మ‌హేష్ ఏఎంబీ బెంగ‌ళూరులో?

By:  Tupaki Desk   |   25 Jan 2020 2:24 PM GMT
మ‌హేష్ ఏఎంబీ బెంగ‌ళూరులో?
X
సినిమాలు.. వ్యాపారాలు .. రెండిటినీ జోడు గుర్రాల్లా ప‌రుగులు పెట్టిస్తున్నాడు మ‌హేష్‌. వ‌రుస‌గా సినిమాలు స‌త్ఫ‌లితాలు ఇస్తున్నాయి. ఇదే హుషారులో ఏఎంబీ మాల్ పేరుతో థియేట‌ర్ల రంగంలోకి ప్ర‌వేశించారు. అలాగే వ‌స్త్ర శ్రేణి వ్యాపారం ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఇక గ‌చ్చిబౌళిలో ఏషియ‌న్ సినిమాస్ తో క‌లిసి నిర్మించిన విలాస‌వంత‌మైన ఏఎంబీ మాల్- అందులో థియేట‌ర్స్ కి వ‌ర‌ల్డ్ క్లాస్ అన్న గుర్తింపు ద‌క్కింది. ఇంకా హైద‌రాబాద్ న‌గ‌రంలో ప‌లు ప్రైమ్ ఏరియాల్లో ఏఎంబీ మాల్స్ నిర్మాణానికి ఏషియ‌న్ తో క‌లిసి మ‌హేష్ -న‌మ్ర‌త బృందం ప్లాన్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

తాజాగా ఈ బిజినెస్ ని బెంగ‌ళూరుకు విస్త‌రించ‌నున్నార‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే బెంగ‌ళూరులోనూ వ‌ర‌ల్డ్ క్లాస్ మాల్ కం థియేట‌ర్ ని నిర్మించే యోచ‌న‌లో ఉన్నార‌ని తెలుస్తోంది. కర్నాట‌క స‌హా బెంగ‌ళూరులో తెలుగు వారు అధికంగా నివ‌శిస్తున్నారు. పైగా అక్క‌డ తెలుగు సినిమాల‌కు ఆద‌ర‌ణ అద్భుతంగా ఉంటోంది. అయితే ఈ ఆలోచ‌న ఇంకా ప్రాథ‌మిక ద‌శ‌లోనే ఉంద‌ని మాట్లాడుకుంటున్నారు. అధికారికంగా ఎంబీ కాంపౌండ్ ధృవీక‌రించాల్సి ఉందింకా.

మ‌హేష్ ప్ర‌స్తుతం అమెరికా వెకేష‌న్ లో ఉన్న సంగతి తెలిసిందే. మ‌హేష్‌- సితార‌- గౌత‌మ్ లు న్యూయార్క్ విహారానికి సంబంధించి ర‌క‌ర‌కాల ఫోటోల్ని న‌మ్ర‌త‌ ఇన్ స్టాలో షేర్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ వెకేష‌న్ పూర్త‌యిన అనంత‌రం వంశీ పైడిప‌ల్లితో ఎంబీ 27 ప్రారంభం కానుంది. ఈలోగానే థియేట‌ర్ బిజినెస్ గురించి ఆస‌క్తిక‌ర అప్ డేట్ లీకైంది.