Begin typing your search above and press return to search.

ఆ డైరెక్టర్ కి మహేష్ మీద ఆశ మాత్రం చావట్లేదుగా...?

By:  Tupaki Desk   |   28 May 2020 4:15 AM GMT
ఆ డైరెక్టర్ కి మహేష్ మీద ఆశ మాత్రం చావట్లేదుగా...?
X
సూపర్ స్టార్ మహేష్ బాబు - డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో 'మహర్షి' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు కెరీర్లో మైలురాయి 25వ చిత్రంగా రూపొందిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సూపర్ స్టార్ ఫ్యాన్స్ మహేష్ సిల్వర్ జూబ్లీ సినిమా ఎలా ఉండాలని భావించారో ఆ అంచనాలకు తగ్గట్టుగానే దర్శకుడు వంశీ పైడిపల్లి మంచి సినిమా అందించారు. ఇదే ఊపులో వంశీ పైడిపల్లి నెక్స్ట్ సినిమా మళ్ళీ మహేష్ తోనే.. అది కూడా గ్యాంగ్ స్టర్ కథాంశం నేపథ్యంలో సినిమా చేయబోతున్నాడని అని అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ ఏడాది ప్రారంభంలో 'సరిలేరు నీకెవ్వరు'తో మంచి విజయం అందుకున్న మహేష్ ఆ తర్వాత డైరెక్టర్ వంశీ పైడిపల్లితో సినిమా పట్టాలెక్కించాలనుకున్నాడు. కానీ వంశీ పైడిపల్లి రెడీ చేసిన స్క్రిప్ట్ విషయంలో మహేష్ బాబు సంతృప్తిగా లేకపోవడంతో ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఈ నేపథ్యంలో మహేష్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం 'గీతగోవిందం' ఫేమ్ పరశురామ్ ని లైన్లో పెట్టాడు.

ఈ సినిమాకి 'సర్కార్ వారి పాట' అనే టైటిల్ అనుకుంటున్నారని.. మే 31న సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్బంగా ఆఫీసియల్ గా స్టార్ట్ చేసే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా దర్శకధీరుడు రాజమౌళి కూడా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మహేష్ బాబుతో ఉంటుందని అనౌన్స్ చేసేసాడు. దీంతో మహేష్ బాబు - వంశీ పైడిపల్లి మూవీ ఇప్పట్లో లేనట్టే అని ప్రచారం జరిగింది. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం వంశీ పైడిపల్లి ఇంకా సూపర్ స్టార్ మీద ఆశలు పెట్టుకున్నాడట. మహేష్ కి స్క్రిప్ట్ వినిపించడానికి మరోసారి ఆయన్ని మీట్ అవబోతున్నాడట వంశీ. అయితే ఈసారి కొత్త స్క్రిప్ట్ తో కలుస్తున్నాడా లేక అదే స్క్రిప్ట్ ను మళ్ళీ రీ డిజైన్ చేస్తున్నాడో అనేది తెలియాల్సి ఉంది. కాకపోతే ఈ స్క్రిప్ట్ కోసం తన టీమ్ ని కూడా మార్చాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. మరి ఈసారైనా మహేష్ ని వంశీ మెప్పిస్తాడేమో చూడాలి.

అయితే ఇప్పుడు వంశీ పైడిపల్లి చెప్పిన స్క్రిప్ట్ మహేష్ కి నచ్చినా అది ఎప్పుడు పట్టాలెక్కుతుందో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే మహేష్ పరశురామ్ సినిమా కంప్లీట్ చేసి జక్కన్న సినిమా పూర్తి చేయడానికి ఎంత టైమ్ పడుతుందో చెప్పలేం. ఈ నేపథ్యంలో వంశీ పైడిపల్లి సినిమా ఇప్పట్లో వచ్చేది కష్టమే అని అనుకోవచ్చు. మరి ఈ రెండు సినిమాల గ్యాప్ లో వంశీ సినిమా ఉంటుందా అంటే అదీ డౌటే. ఎందుకంటే వంశీ పైడిపల్లి సినిమాకి సినిమాకి చాలా టైం తీసుకుంటూ ఉంటాడు అనే టాక్ ఉంది. డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ 13 ఏళ్లలో కేవలం 6 సినిమాలు మాత్రమే తీసాడంటేనే అర్థం చేసుకోవచ్చు వంశీ ఎంత స్లో అండ్ స్టడీగా వేళ్తాడో అనేది. ఇలాంటి నేపథ్యంలో మహేష్ - వంశీ జర్నీ ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు లేకపోవచ్చనే సినీ వర్గాలు అభిప్రాయ పడుతున్నారు.