Begin typing your search above and press return to search.

ఫస్ట్ మూవీ ఇంకా రిలీజ్ కాలేదు.. అప్పుడే రెండో సినిమా గురించి లీకులు..!

By:  Tupaki Desk   |   18 May 2021 2:30 PM GMT
ఫస్ట్ మూవీ ఇంకా రిలీజ్ కాలేదు.. అప్పుడే రెండో సినిమా గురించి లీకులు..!
X
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ చిన్న కొడుకు బెల్లంకొండ గణేష్‌ ని హీరోగా ఇంట్రడ్యూస్ చేయడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. పెద్ద కొడుకు సాయి శ్రీనివాస్ హీరోగా నిలదొక్కుకోడానికి ట్రై చేస్తున్న సమయంలో రెండేళ్ల క్రితం గణేష్ హీరోగా ఓ సినిమాని గ్రాండ్ గా స్టార్ట్ చేశారు. లక్కీ మీడియా బ్యానర్‌ పై బెక్కెం వేణు గోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ప్రేమ ఇష్క్ కాదల్’ ఫేమ్ పవన్ సాధినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గతేడాది గణేష్ పుట్టినరోజు నాడు విషెస్ చెబుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే అప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ గురించి మరో అప్డేట్ లేదు. అప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తయింది అని వార్తలు వచ్చాయి కానీ ఇప్పుడు అసలు ఆ సినిమా ఉందో లేదో అని కామెంట్స్ వస్తున్నాయి.

గత రెండు రోజులుగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు గణేష్ హీరోగా హిందీ సూపర్ హిట్ సినిమా 'వివాహ్' ని రీమేక్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. షాహిద్ కపూర్‌ - అమృత రావ్‌ జంటగా నటించిన సినిమా 'వివాహ్‌' సినిమా 2006లో రిలీజై మంచి విజయాన్ని అందుకుంది. అయితే 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ సినిమా రీమేక్ రైట్స్ ని నిర్మాత బెల్లంకొండ సురేష్‌ దక్కించుకున్నారని తెలుస్తోంది. ఇందులో బెల్లంకొండ గణేష్ హీరోగా నటిస్తారని.. ‘ఉప్పెన’ బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్ గా నటించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈ నేపథ్యంలో బెల్లంకొండ బ్రదర్ మొద‌టి సినిమా ఇంకా విడుదల అవ్వ‌లేదు కానీ అప్పుడే రెండో సినిమా గురించి లీకులు ఇస్తున్నారని సినీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.