Begin typing your search above and press return to search.

క‌వ్విస్తున్న న‌ట‌వార‌సురాలి ఘాటైన‌ భంగిమ‌!

By:  Tupaki Desk   |   20 Aug 2022 4:56 AM GMT
క‌వ్విస్తున్న న‌ట‌వార‌సురాలి ఘాటైన‌ భంగిమ‌!
X
ఒకే సినిమాతో న‌లుగురు న‌ట‌వార‌సులు బాలీవుడ్ కి ప‌రిచ‌య‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. గ‌ల్లీబోయ్స్ ద‌ర్శ‌కురాలు జోయా అక్త‌ర్ న‌ట‌వార‌సుల‌ను ప‌రిచ‌యం చేస్తూ 'ది ఆర్చీస్' ఇండియా వెర్ష‌న్ సిరీస్ ని రూపొందిస్తున్నారు. ఈ సిరీస్ తోనే సుహానా ఖాన్ స‌హా జాన్వీ కపూర్ సోదరి ఖుషీ కపూర్ ప‌రిచ‌య‌మ‌వుతోంది.

అందాల ఖుషీ ఇటీవ‌ల సోషల్ మీడియాల్లో దుమ్ము రేపుతోంది. నిరంత‌రం వేడెక్కించే ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ అభిమానుల్లో గుబులు పెంచుతోంది. సోష‌ల్ మీడియాల్లో ఈ బ్యూటీకి భారీ ఫాలోయింగ్ పెరుగుతోంది. ఇక దివంగ‌త‌ శ్రీ‌దేవి- బోనీ క‌పూర్ ఇంట్లో కాంపిటీష‌న్ గురించి నిరంత‌రం మీడియా హెడ్ లైన్స్ లో చూడాల్సి రావొచ్చ‌ని భావిస్తున్నారు. ఖుషీ క‌పూర్ తెరంగేట్రంపై బోనీక‌పూర్ ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా వేచి చూస్తున్న సంగ‌తి తెలిసిందే.

తాజాగా ఖుషీ కపూర్ షేర్ చేసిన ఓ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో దుమారం రేపుతోంది. బ్లాక్ అండ్ బ్లాక్ డిజైన‌ర్ డ్రెస్ లో ఖుషీ సంథింగ్ స్పెష‌ల్ గా క‌నిపిస్తోంది. ఈ కొత్త లుక్ లో పూర్తిగా మంత్రముగ్ధులను చేసింది. ఆమె తన టోన్డ్ బాడీని ప్రదర్శించిన తీరు మైమ‌రిపిస్తోంది. ఫ్యాష‌న్ ఫోటోగ్రాఫ‌ర్ సాషా జైరామ్ ఆ అద్భుతమైన భంగిమలను త‌న కెమెరాలో బంధించారు. ఖుషీ కపూర్ ఇప్పటికే సోష‌ల్ మీడియాల్లో వేడెక్కించే ఫోటోల‌ను షేర్ చేస్తోంది.

తాజా ఫోటోషూట్ మ‌రింత‌గా వేడెక్కిస్తోంది. ఇక వెండితెర‌పైనా ఇదే తీరుగా చెల‌రేగేందుకు ఖుషీ అడ్డు చెప్ప‌ద‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు. స్నేహితురాలు సుహానా ఖాన్ స‌హా ప‌లువురు సెల‌బ్రిటీలు ఖుషీ కొత్త లుక్ వీక్షించి స్ట‌న్న‌య్యారు. జాన్వీ కూడా అద్భుత‌మైన ట్యాగ్ లైన్ తో ఫ్యాన్స్ ని అలెర్ట్ చేసింది.

'ది ఆర్చీస్' సిరీస్ తోనే షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్- అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా కూడా తెర‌కు ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. వీరంద‌రికీ తొలిచిత్రం కావడంతో హిందీ ప‌రిశ్ర‌మ‌లో చర్చనీయాంశంగా మారింది.

ఇక ఇటీవ‌ల‌ విడుద‌ల చేసిన టీజ‌ర్ పోస్ట‌ర్ల‌పై నెటిజ‌నులు ట్రోల్ చేసిన సంగ‌తి తెలిసిందే. న‌ట‌వార‌సుల‌తో నేల‌విడిచి సాము చేస్తోంద‌ని భార‌తీయ వెర్ష‌న్ లో విదేశీ ప‌రాచికాలేమిటి? అంటూ ద‌ర్శ‌కురాలు జోయాపై కొన్ని కామెంట్లు వినిపించాయి. అయితే ఆ త‌ర్వాత ఆమె జాగ్ర‌త్త‌లు తీసుకుని న‌ట‌వార‌సుల పాత్ర‌ల‌ను తెర‌పైకి తెస్తున్నార‌ని కూడా టాక్ వినిపించింది.