Begin typing your search above and press return to search.

#SURROGACY శిల్పాశెట్టిపై రంగోలి చిందులు!

By:  Tupaki Desk   |   22 Feb 2020 7:23 AM GMT
#SURROGACY శిల్పాశెట్టిపై రంగోలి చిందులు!
X
పిలిచి గిల్ల‌డం.. కొరివితో గోక్కోవ‌డం కంగ‌న సిస్ట‌ర్ రంగోలికి కొత్తేమీ కాదు. బాలీవుడ్ లో కంగ‌న‌కు గిట్ట‌నివాళ్లంద‌రినీ టార్గెట్ చేస్తూ ఢీ అంటే ఢీ అంటుంది. అక్క‌కు అండ‌గా నిలుస్తూ ఘ‌నాపాటీలు అనుకునే వాళ్ల‌నే ఆడేసుకోవ‌డం రంగోలి స్టైల్. ముఖ్యంగా పురుషాధిక్య ప్ర‌పంచంపై ఏవ‌గింపుతో కంగ‌న‌-రంగోలి సిస్ట‌ర్స్ స్టార్ట్ చేసిన వార్ పీక్స్ కి చేరుకుంద‌నే చెప్పాలి.

హృతిక్ రోష‌న్.. రాకేష్ రోష‌న్.. క‌ర‌ణ్ జోహార్.. సాజిద్ ఖాన్.. ఒక‌రేమిటి సిస్ట‌ర్స్ బారిన ప‌డ‌నిది ఎవ‌రు? నెప్టోయిజం పేరుతో ఆలియాభ‌ట్ లాంటి స్టార్ కి తాట తీయ‌డం కంగ‌న‌-రంగోలి సిస్ట‌ర్స్ కి కొత్తేమీ కాదు. ఇప్పుడు ఇదే వ‌రుస‌లో సాగ‌ర క‌న్య శిల్పా శెట్టి.. ఆమె భ‌ర్త రాజ్ కుంద్రా కూడా చేరిపోయారు. ఈ జంట మొన్న‌నే స‌రోగ‌సి (అద్దెగ‌ర్భం) విధానంలో ఆడ‌ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇది సరైన నిర్ణ‌యం కాద‌ని దానికంటే ద‌త్త‌త తీసుకోవ‌డం మేలైన ప‌ని అని కంగ‌న సోద‌రి రంగోలి చుర‌క‌లు వేసే ప్ర‌య‌త్నం చేసింది. ప్ర‌స్తుతం రంగోలి ట్విట్టర్ పోస్ట్ శిల్పా శెట్టి కుంద్రాలో కంప‌రం పుట్టిస్తోందట‌. త‌మ‌ను అపహాస్యం చేస్తూ రంగోలి వేసిన సెటైర్ పై ఈ జంట గ‌రంగా ఉందని బాలీవుడ్ లో క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి.

ఇంత‌కీ రంగోలి ఏమ‌ని అంది? అంటే.. తన భర్త కోరిక మేర‌కు త్వరలోనే ఒక ఆడ శిశువును దత్తత తీసుకుంటున్నట్లు రంగోలి ప్రకటించింది. తన సోదరి కంగనా రనౌత్ అలా చేయటానికి ప్రేరణనిచ్చిందని ఇప్ప‌టికే ఆడ శిశువుకు పేరు కూడా ఎంపిక చేశామ‌ని వెల్ల‌డించింది. ప‌నిలో ప‌నిగా శిల్పా శెట్టి స‌హా ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖులు చేసిన పనిపైనా రంగోలి సెటైర్ వేసింది. ``సర్రోగసీని ఎక్కువగా ఎంచుకుంటున్న ప్రముఖులు.. దానికంటే జ‌నాన్ని దత్తత తీసుకుంటే బావుంటుంది. సర్రోగసీ ప్ర‌య‌త్నం స‌రికాదు`` అని పంచ్ వేసింది. ``నాకు ఒక బిడ్డ ఉంది. నా భర్త మరొకరిని కోరుకుంటున్నారు. దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. స‌రోగ‌సికి వెళ్ళడం కంటే దత్తత తీసుకోవటాన్ని జంటలు ప్రోత్సహించాలనుకుంటున్నాను. నా సోదరి ఇందుకు స్ఫూర్తినిచ్చింది. అజయ్(భ‌ర్త‌) నేను కొన్ని నెలల్లో అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేస్తాం`` అని తెలిపింది.

శిల్పా శెట్టి కుంద్రా తన రెండవ బిడ్డకు సర్రోగసీ ద్వారా జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ సంగ‌తిని ఇటీవ‌లే శెట్టి-కుంద్రా జంట ప్ర‌క‌టించారు. ఫిబ్రవరి 15 న జన్మించిన ఈ దేవదూతకు సమీషా శెట్టి కుంద్రా అని పేరు పెట్టారు. ఇక బాలీవుడ్ లో సర్రోగసీ ద్వారా పిల్ల‌ల్ని క‌న్న సెల‌బ్రిటీల జాబితాలో కరణ్ జోహార్- తుషార్ కపూర్- సన్నీ లియోన్- షారూఖ్ ఖాన్ - అమీర్ ఖాన్ ఉన్నారు. టాలీవుడ్ లో మంచు ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పేరు ప్ర‌ముఖంగా వినిపించింది.