Begin typing your search above and press return to search.

బాలీవుడ్ హీరోలు బాయిల్డ్ ఎగ్ టైప్ అంట‌

By:  Tupaki Desk   |   17 May 2022 3:27 AM GMT
బాలీవుడ్ హీరోలు బాయిల్డ్ ఎగ్ టైప్ అంట‌
X
ముక్కు సూటిగా మాట్లాడ‌డం కొంద‌రికి మాత్ర‌మే అల‌వాటు. ఈ జాబితాలో కంగ‌న పేరు టాప్ లో ఉంది. అనేక విషయాలపై తన ఆలోచనలను నిజాయితీగా వ్యక్తీకరించడంలో క్వీన్ చాలా పాపులారిటీ తెచ్చుకుంది. ఇటీవల ధాక‌డ్ చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి చిత్ర‌బృందంతో కలిసి కపిల్ శర్మ షోలో కనిపించింది. ఈ కార్యక్రమంలో ఆమె హిందీ చిత్ర పరిశ్రమతో పాటు పరిశ్రమలోని పలువురు నటీనటులపై విరుచుకుపడింది.

''బొల్లి బింబో''ని వివరించమని అడిగినప్పుడు కంగనా రనౌత్ ఎగతాళిగా ఆమె ముక్కును నాలుకతో తాకింది. ఇది ప‌రిశ్ర‌మ ఇన్ సైడ‌ర్ కం న‌ట‌వార‌సురాలు అనన్య పాండే ని దెప్పి పొడిచే ప‌నే అంటూ దానిపై బోలెడంత డిస్క‌ష‌న్ సాగింది. షోలో పోస్ట్ కా పోస్ట్ మార్టం అనే సెగ్మెంట్ లో కపిల్ సెలబ్రిటీ అతిథుల సోషల్ మీడియా పోస్ట్ లను ఎంపిక చేసుకుంటాడు. సెలబ్రిటీలు ప్రతిస్పందించడానికి పోస్ట్ లపై కొన్ని వ్యాఖ్యలను చదివాడు. సెగ్మెంట్ సమయంలో కపిల్ కంగనాను ఇన్ స్టాగ్రామ్ లో తన పోస్ట్ లలో ఒకదానిలో ఉపయోగించిన బోలీ బింబో అనే పదానికి అర్థాన్ని అడిగాడు. ఈ ప్రశ్నకు సమాధానంగా కంగనా తన నాలుకతో ముక్కును తాకే ప్రయత్నం చేసింది. తన నాలుకతో ముక్కును తాకడం తన ప్రతిభలో ఒకటని ఇంతకుముందు చమత్కరించిన అనన్య పాండేని క్వీన్ అనుకరించింది. అనన్య పేరును కంగనా ప్ర‌స్థావించ‌క‌పోయినా కానీ.. అభిమానులు మాత్రం అవును లైగ‌ర్ బ్యూటీనే అని అర్థం చేసుకునేలా హింట్ ఇచ్చింది. కంగనా ఉద్ధేశం ప్ర‌కారం.. "నేను నా నాలుకను నా ముక్కుకు తాకగలను" అని చెప్పే వారు బొల్లి బింబోలు.

కంగనా తరచుగా కరణ్ జోహార్ ని సినీ పరిశ్రమలో చేరిన స్టార్ కిడ్స్ ని త‌న‌దైన శైలిలో ఆడుకుంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే. అనన్య 2019లో కరణ్ జోహార్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 ద్వారా పరిశ్రమలోకి ప్రవేశించారు. త‌న‌ని ర‌క‌ర‌కాల సంద‌ర్భాల్లో కంగ‌న తూట్లు పొడిచిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌రోసారి త‌న‌ని ఇమ్మిటేట్ చేస్తూ ఆట‌ప‌ట్టించింది.

'ఢాకడ్' చిత్రం మే 20న థియేటర్లలో విడుదల కానుంది. రజ్నీష్ ఘై దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్- దివ్యా దత్తా- షరీబ్ హష్మీ- శాశ్వత ఛటర్జీ- మహాక్షయ్ చక్రవర్తి నటించారు.

అంతే కాదు.. కంగనా రనౌత్ బాలీవుడ్ నటులను ఉడకబెట్టిన గుడ్లతో పోల్చింది. కంగనా రనౌత్ ఢాకాడ్ ను ప్రమోట్ చేసే పనిలో మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ vs సౌత్ వ్య‌వ‌హారం గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఆమె ఇటీవల మహేష్ బాబుకు మద్దతుగా నిలిచి తార‌లు తమ ప్రేక్షకులతో ఒక ర‌కమైన కనెక్టివిటీతో ఉండాల‌ని ప్ర‌స్థావించింది.

సౌత్ నటీనటులను బాలీవుడ్ తార‌ల‌తో పోల్చిన కంగనా రనౌత్ వారు తమ ప్రేక్షకులతో బలమైన అనుబంధాన్ని పంచుకుంటారని తన ప్రకటనలో తెలిపింది. అల్లు అర్జున్ నటించిన పుష్పను ఉదాహరణగా చెబుతూ.. సౌత్ సూపర్ స్టార్ ఒక‌ కార్మికుడి పాత్రతో సామాన్యుల‌కు -కార్మికులకు ఎలా కనెక్ట్ అవుతారనే దాని వల్లనే ఈ చిత్రం విజయవంతమైందని కంగనా పేర్కొన్నారు. మరోవైపు బాలీవుడ్ నటులకు ఆ కనెక్షన్ లేదని కంగ‌న విమ‌ర్శించింది.

సౌత్ వర్సెస్ బాలీవుడ్ పోలికను కొనసాగిస్తూ.. బాలీవుడ్ నటులు ఇంగ్లీషులో మాట్లాడతారని హాలీవుడ్ చిత్రాలను మాత్రమే చూస్తారని.. కత్తి- ఫోర్క్ ల‌తో మాత్రమే తింటారని .. విభిన్నంగా మాట్లాడతారని కంగనా పేర్కొంది. స్టార్ పిల్లలు కూడా విదేశీ విద్యావంతులే అని ఎత్తి చూపింది. ఇంకా చెబుతూ అవన్నీ ఉడకబెట్టిన గుడ్లలా విచిత్రంగా ఉన్నాయని వారి మొత్తం లుక్ చాలా భిన్నంగా ఉందని ప్రజలు పరస్పరం సంబంధం పెట్టుకోలేరని ఆమె తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది. ఎవరినీ ట్రోల్ చేయడం తన ఉద్దేశం కాదని కూడా చెప్పింది.

కంగ‌న త‌న చిత్రం ధాకడ్ గురించి మాట్లాడుతూ- ఇందులో ఏజెంట్ అగ్ని పాత్రలో యాక్షన్ ప్యాక్డ్ అవతార్ లో కనిపిస్తాన‌ని తెలిపారు. ఫైట్స్ స‌హా మార్ష‌ల్ ఆర్ట్స్ లో విస్తృతమైన శిక్షణను పొందిన కంగ‌న‌.. యాక్ష‌న్ తో మ‌రిపించ‌నున్నామ‌ని తెలిపారు. స్పై థ్రిల్లర్ లో అర్జున్ రాంపాల్ -దివ్యా దత్తా కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. రజనీష్ ఘాయ్ రచన - దర్శ