Begin typing your search above and press return to search.

'రణబీర్ ఒక రేపిస్ట్, దీపికా ఒక సైకో'అంటున్న వివాదాల స్టార్ హీరోయిన్

By:  Tupaki Desk   |   11 Aug 2020 3:15 AM GMT
రణబీర్ ఒక రేపిస్ట్, దీపికా ఒక సైకోఅంటున్న వివాదాల స్టార్ హీరోయిన్
X
బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్ ఇప్పట్లో నేపోటిజం చర్చను విడిచిపెట్టేలా లేదు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయినప్పటి నుండి ఆమె ఆరోపణలను వినిపిస్తూనే ఉంది. బాలీవుడ్‌లోని బంధుప్రీతి అలాగే మాఫియా కారణంగానే సుశాంత్ తన జీవితాన్ని వదులుకున్నాడని బలంగా చెబుతుంది. బయట వ్యక్తిగా.. కంగనా ప్రతి రోజు తన కామెంట్లతో బాలీవుడ్ మాఫియా కళ్లు తెరిపించడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఈసారి నేపోటిజం వివాదాన్ని మరో లెవెల్ కి తీసుకెళ్లింది. ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వివాదాలను చెలరేగేలా చేస్తున్నాయి. కొత్తగా రణబీర్ కపూర్‌ను ‘రేపిస్ట్’ అని.. అలాగే దీపికా పదుకొనేను ‘సైకో’ అని పిలిచింది. కంగనా ట్విట్టర్ వేదికగా నేపోటిజం గురించి సంచలన ట్వీట్ చేసింది.

అందులో.. "రణబీర్ కపూర్‌ను సీరియల్ స్కర్ట్ ఛేజర్ అని పిలిచింది.. కాని ఎవరూ అతన్ని రేపిస్ట్ అని పిలవరు. అలాగే దీపికాను స్వతహాగా మానసిక రోగి అని కూడా పిలిచింది.. కాని ఏ ఒక్కరూ కూడా ఆమెను సైకో లేదా మంత్రగత్తె అని పిలవలేదు" అంటూ ట్వీట్ చేసి రచ్చ లేపుతోంది. అలాగని వీళ్ళని మాత్రమే కంగనా టార్గెట్ చేయడం లేదు. ఇండస్ట్రీలో నేపోటిజం వలన సెటిల్ అయిన ప్రతీ ఒక్కరిపై ఆమె యుద్ధం చేస్తోందని అంటున్నారు. కంగనా గురించి అందరికి తెలిసిందే. ఆమె ఎంత మొండిదో.. అంతే విధంగా ముక్కుసూటి మనిషి కూడా.. తనకు ఏదనిపిస్తే అదే ముఖం మీదే చెప్పేస్తుంది. ఇక రణబీర్, దీపిక, కరీనాల ప్లాప్ సినిమాలను ప్రస్తావిస్తూ.. అవి నేపోటిజం అండ్ మాఫియా కారణంగా ఫెయిల్ అవ్వలేదని చెప్పుకొచ్చింది.

ఈ సమయంలో కంగనా సుశాంత్ మరణాన్ని తీవ్రంగా రేకెత్తిస్తున్న విషయం భరించలేక కొందరు.. కంగనాకు వ్యతిరేకంగా కెరీర్లో ప్లాప్ సినిమాలను, ఆమె బాయ్‌ఫ్రెండ్లతో పాటు పెళ్ళైన హీరోలతో కంగనా అఫైర్లను ఎత్తిచూపుతున్నారు. ఇటీవల తాప్సీ.. స్వరా భాస్కర్.. రిచా చాధా లపై కంగనా చేసిన వ్యాఖ్యలను వారు అంతే బలంగా తిప్పికొట్టారు. తాజాగా ఆమె ట్వీట్లతో టాలెంటెడ్ యాక్టర్ ఆయుష్మాన్ ఖుర్రానా పై యుద్ధం ప్రకటించిన విషయం తెలిసిందే. అతడిని ‘చాప్లూస్’ అని సంబోధించి బాలీవుడ్ ఇండస్ట్రీలో తన కెరీర్ కాపాడుకోవడానికి బంధుప్రీతికి వత్తాసు పలికాడని సంచలన వ్యాఖ్యలు చేసి వార్తలలో నిలుస్తుంది కంగనా. ప్రస్తుతం ఈమె ట్వీట్ లపై రణబీర్, దీపికల నుండి స్పందన రావాల్సి ఉంది.