Begin typing your search above and press return to search.
విశ్వనటుడ్నే టెన్షన్ పెట్టిస్తోన్న మణిరత్నం!
By: Tupaki Desk | 31 May 2023 3:00 PM GMTవిశ్వనటుడు కమల్ హాసన్-మణిరత్నం కాంబినేషన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరి కాంబినేషన్ లో తెరెక్కిన 'నాయకుడు' అప్పట్లో ఓ సంచలనం. ఐకానిక్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. కానీ ఆ తర్వాత ఆ జోడి చేతులు కలిపింది లేదు. ఎవరికి వారు స్వతంత్రం గా సినిమాలు చేసుకున్నారు! తప్ప మళ్లీ కలిసి పనిచేయాలి అన్న ఆలోచన తట్టడానికే 25 ఏళ్లు పట్టింది.
తాజాగా ఇటీవలే ఇద్దరు మళ్లీ చేతులు కలుపుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 'కేహెచ్ 234' వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుందని కమల్ పుట్టిన రోజు సందర్భంగా ప్రకటించారు. దీంతో సినిమా పై అంచానలు భారీగా ఏర్పడుతున్నాయి. 25 ఏళ్ల తర్వాత కలయిక కావడంతో! ఇద్దరి అభిమానుల్లోనూ అంచనాలు స్కైని టచ్ చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమా కి సంబంధించిన మరిన్ని విశేషాల్ని కమల్ పంచుకున్నారు.
ఈ సినిమా పై ఏర్పడుతున్న అంచనాలు చూస్తుంటే కాస్త కంగారు గానే ఉంది. తెలిసో తెలియకో ఒత్తిడి కి గురవుతున్నట్లు అనిపించింది. ఇన్నేళ్ల ప్రయాణంలో ఏనాడు ఇలాంటి అనుభూతికి లోనవ్వలేదు. బహుశా అభిమానులు మా పై పెట్టుకున్న ఆశలే నన్ను ఆ పరిస్థితికి తీసుకెళ్తున్నాయేమో. నాయకుడు తరహాలో నే ఈసినిమా కూడా చాలా శక్తివంతంగా ఉంటుంది. రాబోయే రెండు.మూడు నెల్లలో షూటింగ్ ప్రారంభమవుతుంది' అని తెలిపారు.
సినిమా లో ఎలాంటి పాత్రలుంటాయి. వాటిలో ఎలాంటి నటీనటులు నటిస్తారు? అన్న వివరాలు అతి త్వరలోనే రివీల్ కానున్నాయని చిత్ర వర్గాల నుంచి తెలుస్తుంది. ఇందులో కమల్ హాసన్ ని జోడీ గా త్రిష ని ఎంపిక చేసినట్లు సమాచారం.
లోకనాయకుడితో త్రిష నటించడం మూడవసారి. గతంలో 'తూంగవనం'..'మన్మధన్ అంబూ' సినిమాల్లో జంటగా నటించారు. మణిరత్నం అవకాశం కలిస్తే కమల్ తో అమ్మడు హ్యాట్రిక్ పూర్తి చేసుకుంటుంది. మరి తుదిగా ఏ నాయికగా అవకాశం కల్పిస్తారో అధికారికంగా ప్రకటిస్తే గానీ క్లారిటీ రాదు.
తాజాగా ఇటీవలే ఇద్దరు మళ్లీ చేతులు కలుపుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 'కేహెచ్ 234' వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుందని కమల్ పుట్టిన రోజు సందర్భంగా ప్రకటించారు. దీంతో సినిమా పై అంచానలు భారీగా ఏర్పడుతున్నాయి. 25 ఏళ్ల తర్వాత కలయిక కావడంతో! ఇద్దరి అభిమానుల్లోనూ అంచనాలు స్కైని టచ్ చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమా కి సంబంధించిన మరిన్ని విశేషాల్ని కమల్ పంచుకున్నారు.
ఈ సినిమా పై ఏర్పడుతున్న అంచనాలు చూస్తుంటే కాస్త కంగారు గానే ఉంది. తెలిసో తెలియకో ఒత్తిడి కి గురవుతున్నట్లు అనిపించింది. ఇన్నేళ్ల ప్రయాణంలో ఏనాడు ఇలాంటి అనుభూతికి లోనవ్వలేదు. బహుశా అభిమానులు మా పై పెట్టుకున్న ఆశలే నన్ను ఆ పరిస్థితికి తీసుకెళ్తున్నాయేమో. నాయకుడు తరహాలో నే ఈసినిమా కూడా చాలా శక్తివంతంగా ఉంటుంది. రాబోయే రెండు.మూడు నెల్లలో షూటింగ్ ప్రారంభమవుతుంది' అని తెలిపారు.
సినిమా లో ఎలాంటి పాత్రలుంటాయి. వాటిలో ఎలాంటి నటీనటులు నటిస్తారు? అన్న వివరాలు అతి త్వరలోనే రివీల్ కానున్నాయని చిత్ర వర్గాల నుంచి తెలుస్తుంది. ఇందులో కమల్ హాసన్ ని జోడీ గా త్రిష ని ఎంపిక చేసినట్లు సమాచారం.
లోకనాయకుడితో త్రిష నటించడం మూడవసారి. గతంలో 'తూంగవనం'..'మన్మధన్ అంబూ' సినిమాల్లో జంటగా నటించారు. మణిరత్నం అవకాశం కలిస్తే కమల్ తో అమ్మడు హ్యాట్రిక్ పూర్తి చేసుకుంటుంది. మరి తుదిగా ఏ నాయికగా అవకాశం కల్పిస్తారో అధికారికంగా ప్రకటిస్తే గానీ క్లారిటీ రాదు.