Begin typing your search above and press return to search.

ఆ శుభ‌వార్త‌ను కాజ‌ల్ త‌న నిర్మాత‌లకు చెప్పార‌ట‌!

By:  Tupaki Desk   |   16 Sep 2021 1:30 AM GMT
ఆ శుభ‌వార్త‌ను కాజ‌ల్ త‌న నిర్మాత‌లకు చెప్పార‌ట‌!
X
అందాల చంద‌మామ కాజ‌ల్ త‌న చిన్న నాటి స్నేహితుడు బిజినెస్ మేన్ గౌత‌మ్ కిచ్లుని పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం త‌ను గ‌ర్భ‌వ‌తి అన్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. కాజ‌ల్ స్వ‌యంగా ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించ‌క‌పోయినా తన నిర్మాత‌లు ముందే హింట్ ఇచ్చార‌ని కూడా గుస‌గుస‌లు స్ప్రెడ్ అవుతున్నాయి. ఇప్ప‌టికే ఆచార్య నిర్మాత‌ల‌కు ఈ విష‌యాన్ని చెప్పార‌ని త్వ‌ర‌లోనే పెండింగ్ ఉన్న పాట‌ను చిత్రీక‌రిస్తార‌ని అందుకు కాజ‌ల్ ఓకే చెప్పార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ఈ షూటింగ్ సాధ్య‌మైనంత తొంద‌రగానే పూర్తి చేయ‌నున్నార‌ట‌.

కరోనా మొదటి వేవ్ అనంత‌రం కాజ‌ల్ .. గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుంది. ఆమె తన భర్తను `ఆచార్య` సెట్స్ కి తీసుకువచ్చి చిరంజీవి స‌హా చిత్ర‌బృందానికి పరిచయం చేసింది. ఇటు తెలుగు సినిమాలు స‌హా అటు త‌మిళంలో బాలీవుడ్ లో మరికొన్ని ప్రాజెక్ట్ లను కాజ‌ల్ ఓకే చేసిన సంగ‌తి తెలిసిందే. కానీ అవ‌న్నీ ఏ ద‌శ‌లో ఉన్నాయి అనే దానిని బ‌ట్టి ప్ర‌తిదీ నిర్ణ‌యం తీసుకునే వీలుంటుంద‌ట‌. సౌత్ లో 15 ఏళ్ల‌ సుదీర్ఘ కెరీర్ ను కొనసాగించిన అతికొద్ది మంది నటీమణులలో కాజ‌ల్ ప్ర‌థ‌మ స్థానంలో ఉంది.

కాజ‌ల్ మైన‌పు విగ్ర‌హం సీక్రెట్ ల‌వ్

ప్ర‌తిష్ఠాత్మ‌క‌ మేడమ్ టుస్సాడ్స్ లో మైనపు విగ్రహాల పంక్తిలో కొలువు దీరే అరుదైన అవ‌కాశం అదృష్టం ఇద్దరు సౌత్ స్టార్ల‌కే ద‌క్కింది. దక్షిణ భారత నటులు ప్ర‌భాస్ - మహేష్ ల‌కు మాత్ర‌మే ఆ ఛాన్స్ ద‌క్క‌డంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. ఆ త‌ర్వాత అందాల చంద‌మామ కాజ‌ల్ కి మాత్ర‌మే ఈ రేర్ ఛాన్స్ ద‌క్కింది. కాజల్ అగర్వాల్ ఆ ఆవిష్క‌ర‌ణ‌కు ముందు జ‌రిగిన ఓ ఆస‌క్తిక‌ర సంగ‌తిని అప్ప‌ట్లో రివీల్ చేసారు. త‌న ప్రియుడు‌(అప్ప‌టికి) గౌతమ్ కిచ్లు తో క‌లిసి ఈ విగ్ర‌హా‌న్ని అప్ప‌ట్లోనే కాజ‌ల్ సంద‌ర్శించార‌ట‌‌. అది కూడా ప్ర‌యివేటుగా..! కాజల్ అగర్వాల్ గౌతమ్ కిచ్లు మైన‌పు విగ్రహంతో ఉన్న‌ప్ప‌టి నాటి స్నాప్ ను అభిమానుల‌కు షేర్ చేయ‌గా అది వైర‌ల్ అయింది. మేడమ్ టుస్సాడ్స్ సింగపూర్ నుండి మైనపు విగ్రహంతో ఫోటో ఇద‌ని కాజ‌ల్ వెల్ల‌డించింది. దాంతో పాటు ఒక టాప్ సీక్రెట్ ని ఓపెన్ అయ్యేలా చేసింది.

పెళ్లికి చాలా ముందే...గౌత‌మ్ తో కాజ‌ల్ ప్రేమ‌లో ఉన్న‌ప్పుడు.. తన మైనపు విగ్రహాన్ని ప్రైవేటుగా చూడటానికి గౌతమ్ సింగపూర్ కి వ‌చ్చార‌ని కాజ‌ల్ వెల్లడించారు. అప్ప‌టికే ఎలైట్ మ్యూజియంలో మైనపు విగ్రహాన్ని క‌లిగి ఉన్న మొట్ట‌ మొదటి దక్షిణ భారత నటిగా కాజ‌ల్ పేరు మార్మోగిన సంగ‌తి తెలిసిందే. 2020 ఫిబ్ర‌వ‌రిలో ఈ విగ్ర‌హాన్ని ఆవిష్క‌‌రించింది టుస్సాడ్స్ బృందం. తన భర్త తనతో ఉండటానికి కొద్ది గంటల పాటు సింగపూర్ ‌కు ఎలా వచ్చార‌నే ఆసక్తికరమైన సంఘటనను కూడా ఆమె వెల్లడించారు.
5 ఫిబ్ర‌వ‌రి 2020 న సింగపూర్ ‌లో త‌న‌ మైనపు విగ్రహావిష్క‌ర‌ణ‌కు కాజల్ అగర్వాల్ కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. ఆమె విగ్రహాన్ని బహిరంగంగా ఆవిష్కరించే ఒక‌రోజు ముందు.. ప్రియుడు గౌతమ్ కూడా అక్క‌డే ఉన్నాడు. అక్క‌డ అత‌డు ప్రైవేట్ గా ఈ విగ్ర‌హాన్ని వీక్షించాడ‌ట‌. ఎందుకంటే అతడు `ఫైనల్ ఆవిష్క‌ర‌ణ‌`కు అక్క‌డ ఉండ‌లేని ప‌రిస్థితి ఎదురైంద‌ని కాజ‌ల్ వెల్ల‌డించారు.

ఒక రోజు ముందే అంటే 2020 ఫిబ్ర‌వ‌రి 4న కిచ్లు సింగపూర్ కి వెళ్లారు. అతను ఆ బిగ్ మూవ్ మెంట్ అక్కడ ఉండలేని స్థితి. ఫిబ్ర‌వ‌రి 5 ఉదయం తన వ్యాపారం పనిపై జర్మనీకి వెళ్లాల్సి వ‌చ్చింద‌ని కాజ‌ల్ టాప్ సీక్రెట్ ని వెల్ల‌డించారు. అతను ఎలా వచ్చినా నేను ప్రేమిస్తున్నాను.. నాకు మాత్రమే తెలుసు..! అంటూ గుంభ‌న‌గా ఆ సీక్రెట్ మ్యాట‌ర్ ని ఓపెనైపోయారు కాజ‌ల్.