Begin typing your search above and press return to search.

ఆమె క్రేజ్‌ కు ఇన్‌ స్టాగ్రామ్‌ షాక్‌

By:  Tupaki Desk   |   17 Oct 2019 1:30 AM GMT
ఆమె క్రేజ్‌ కు ఇన్‌ స్టాగ్రామ్‌ షాక్‌
X
తమ అభిమాన తారలను సోషల్‌ మీడియా ద్వారా ఫాలో అయ్యే వారి సంఖ్య లక్షల నుండి కోట్లకు పెరిగి పోయింది. సెలబ్రెటీ ఎవరైనా సోషల్‌ మీడియాలో ఎంటర్‌ అవ్వడమే ఆలస్యం లక్షల్లో ఫాలోవర్స్‌ అవుతారు. ఇటీవల హాలీవుడ్‌ స్టార్‌ జెన్నిఫర్‌ యానిస్టన్‌ ఇన్‌ స్టాగ్రామ్‌ లో జాయిన్‌ అయ్యింది. ఆమె గతంలో చేసిన ఒక కామెడీ సిరీస్‌ 'ఫ్రెండ్స్‌' కు సంబంధించి ఒక వర్కింగ్‌ స్టిల్‌ పెట్టింది. జెన్నిఫర్‌ ఇన్‌ స్టా లో ఎంటర్‌ అవ్వడమే కాకుండా ఆమె పెట్టిన ఫోటో జనాలకు విపరీతంగా నచ్చేయడంతో రికార్డు స్థాయిలో ఆ ఫొటోకు రియాక్ట్‌ అయ్యారు.

జెన్నిఫర్‌ ఇన్‌ స్టా పేజ్‌ కు విపరీతమైన ఆడియన్స్‌ రావడంతో పాటు ఆ ఫొటోకు అత్యధికంగా ఇంప్రెషన్స్‌ రావడంతో ఆ పోస్ట్‌ తో పాటు ఏకంగా జెన్నిఫర్‌ అకౌంట్‌ క్రాష్‌ అయ్యింది. ఎక్కువ మంది ఆ పేజ్‌ ను విజిట్‌ చేసిన కారణమో లేక మరేంటో కాని జెన్నిఫర్‌ ఇన్‌ స్టా పేజ్‌ పని చేయలేదు. వెంటనే ఇన్‌ స్టాగ్రామ్‌ అధికారులు స్పందించి ఆమె పేజ్‌ ను రిస్టోర్‌ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు.

ఇప్పటి వరకు ఎప్పుడు ఇలా జరగలేదని.. ఒక సెలబ్రెటీకి ఇంతగా ఫాలోయింగ్‌ ను చూస్తే ఆశ్చర్యంగా ఉందని వారు అంటున్నారు. హీరోయిన్‌ గానే కాకుండా పలు షోల ద్వారా.. వెబ్‌ సిరీస్‌ ల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా భారీగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెంచుకున్న జెన్నిఫర్‌ సోషల్‌ మీడియాలోకి ఎంటర్‌ అవ్వగానే ఆమెను ఫాలో అవ్వాలనే ఉద్దేశ్యంతో ఒక్కసారిగా ఆమె పేజ్‌ ను విజిట్‌ చేయడం వల్ల ఆమె సోషల్‌ మీడియా పేజ్‌ క్రాష్‌ అయ్యిందని ఒక అంతర్జాతీయ మీడియా సంస్థ వార్త కథనం రాసింది. 1994 నుండి 2004 వరకు సాగిన 'ఫ్రెండ్స్‌' కామెడీ షో తో జెన్నిఫర్‌ ఇండియాలో కూడా విపరీతమైన క్రేజ్‌ ను దక్కించుకుంది.