Begin typing your search above and press return to search.

ప్రతిరోజు నిన్ను మిస్‌ అవుతూనే ఉన్నా

By:  Tupaki Desk   |   24 Feb 2020 8:00 AM GMT
ప్రతిరోజు నిన్ను మిస్‌ అవుతూనే ఉన్నా
X
అతిలోక సుందరి శ్రీదేవి మరణించి రెండు సంవత్సరాలు అవుతుంది. ఆమె మరణ వార్తను అభిమానులు ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారు. ఆమె సినిమాలను.. ఆమె కార్యక్రమాలను బుల్లి తెరపై చూస్తున్న ప్రతిసారి ప్రేక్షకులు ఆమె ఇంకా బతికే ఉందేమో అనే బ్రమ పడుతున్నారు. ఆమె మరణం నుండి ఇండస్ట్రీ వర్గాల వారు కూడా బయటకు రాలేక పోతున్నారు. ఇక ఆమె కుటుంబ సభ్యుల పరిస్థితి గురించి ప్రత్యేకం గా చెప్పనక్కర్లేదు.

ముఖ్యంగా శ్రీదేవి తో పెద్ద కూతురు జాన్వీ కపూర్‌ కు మంచి అనుబంధం ఉంది. తల్లి లేని లోటు ఆమెకు క్లీయర్‌ గా తెలుస్తుందట. ప్రస్తుతం హీరోయిన్‌ గా మంచి పేరు దక్కించుకున్న తనను అమ్మ చూడలేక పోయింది.. అమ్మ నన్ను ఈ పరిస్థితుల్లో చూడాలని అనుకుంది. కాని ఆమె ఇప్పుడు లేదు.. నా సినిమాలను ఆమె చూడలేక పోయింది అని జాన్వీ కపూర్‌ అప్పుడప్పుడు ఎమోషనల్‌ అవుతూనే ఉంటుంది. తాజాగా మరోసారి జాన్వీ కపూర్‌ ఎమోషనల్‌ అయ్యింది.

నేడు శ్రీదేవి రెండవ వర్ధంతి సందర్బంగా తన తల్లితో ఉన్న చిన్నప్పటి ఫొటోను జాన్వీ షేర్‌ చేసింది. అమ్మ ఒడి లో అలా ఒదిగి పోయిన జాన్వీ కపూర్‌ నిన్ను ప్రతి రోజు మిస్‌ అవుతున్నాను అంటూ పోస్ట్‌ చేసింది. జాన్వీ కపూర్‌ పోస్ట్‌ కు చాలా మంది రెస్పాండ్‌ అవుతున్నారు. జాన్వీ కపూర్‌ ఎమోషనల్‌ పోస్ట్‌ ప్రస్తుతం వైరల్‌ అయ్యింది.