Begin typing your search above and press return to search.

నాగ్ మూవీకి పాన్ ఇండియా హంగులు

By:  Tupaki Desk   |   26 Sep 2021 12:30 AM GMT
నాగ్ మూవీకి పాన్ ఇండియా హంగులు
X
నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్‌ సత్తార్ దర్శకత్వంలో 'ది ఘోస్ట్‌' అనే సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఇటీవలే విడుదల అయిన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ టాలీవుడ్‌ రేంజ్ మించి బాలీవుడ్‌ రేంజ్ లో ఉందనే టాక్ వచ్చింది. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను విడుదల చేస్తే బాగుంటుందనే అభిప్రాయం అక్కినేని అభిమానుల్లో వ్యక్తం అవుతోంది. చిత్ర యూనిట్‌ సభ్యులు కూడా సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ది ఘోస్ట్‌ సినిమా లో కీలక పాత్రలో కాజల్‌ ను నటింపజేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. షూటింగ్‌ ప్రారంభించాలనుకున్న సమయంలో కరోనా వల్ల షూటింగ్‌ వాయిదా పడింది. ఈ లోపు కాజల్ ప్రెగ్నెంట్‌ కావడం వల్ల ఆమెను తప్పించి మరో హీరోయిన్ ను ఈ సినిమా లో నటింపజేస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాజల్‌ దాదాపుగా అన్ని ప్రాజెక్ట్‌ లను ముగించేసింది. ఆరంభం కాని ప్రాజెక్ట్‌ లను మాత్రం వదిలేసిందని టాక్‌.

కాజల్‌ తప్పుకోవడం వల్ల పలువురు సీనియర్ హీరోయిన్స్ పేర్లు వినిపించాయి. ముఖ్యంగా త్రిష మరియు శ్రియల పేర్లు వినిపించాయి. నాగార్జునకు జోడీగా వీరిద్దరిలో ఎవరైనా చాలా బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది. అయితే ఈ సినిమా ను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలని భావిస్తున్నాం కనుక బాలీవుడ్‌ లో మంచి గుర్తింపు ఉన్న అమ్మాయిని తీసుకు వస్తే ఈ సినిమాకు అక్కడ మంచి క్రేజ్‌ ఏర్పడుతుంది కదా అని మేకర్స్‌ భావించారట. అందుకే ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. ఆమె అయితే సౌత్‌ తో పాటు నార్త్‌ లో కూడా సినిమా గురించి మాట్లాడుకునేలా చేస్తుంది. అందుకే పాన్ ఇండియా అప్పీల్‌ ఇవ్వడం కోసం ఈ అమ్మడిని ఎంపిక చేశారని అంటున్నారు. ఈ విషయమై యూనిట్‌ సభ్యుల నుండి అధికారిక స్పందన రావాల్సి ఉంది.

బాలీవుడ్‌ లో జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ వరుస సినిమాలతో ఆకట్టుకుంటూ మంచి గుర్తింపు దక్కించుకుంది. అక్కడ స్టార్‌ హీరోల సినిమాల్లో నటించడం వల్ల వచ్చిన స్టార్‌ డమ్‌ తో నాగ్ ది ఘోస్ట్‌ సినిమాకు అక్కడ మంచి బజ్ క్రియేట్‌ అయ్యేలా చేస్తుంది. అందుకే పాన్ ఇండియా మూవీస్ కు బాలీవుడ్ ముద్దుగుమ్మలను నటింపజేస్తారు. అలాగే ఈ సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలనే ఉద్దేశ్యం ఉండటం వల్ల జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను నటింపజేస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించి కొంత మేరకు షూటింగ్ పూర్తి చేయడం జరిగింది. ఒక వైపు ది ఘోస్ట్‌ సినిమాను చేస్తూనే మరో వైపు నాగార్జున బంగార్రాజు సినిమాను కూడా చేస్తున్నాడు. రెండు సినిమాలు కొద్ది తేడాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ఉన్నాయి.